News February 8, 2025

వరంగల్ ఇన్‌ఛార్జి డీటీఓగా శోభన్ బాబు

image

వరంగల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయ ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ దాడులు, అరెస్టు తర్వాత మరో అధికారిపై వేటు వేశారు. వరంగల్ డీటీఓ లక్ష్మిపై బదిలీ ప్రభుత్వం వేటు వేసిన తెలిసిందే. కాగా ఎంవీఐ శోభన్ బాబును వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News February 8, 2025

నర్సంపేట: గుప్త నిధుల కోసం తవ్వకాలు

image

నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల కలకలం రేపింది. గ్రామ శివారులో గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక జేసీబీ , రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News February 8, 2025

వరంగల్: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో వరంగల్ జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.

News February 8, 2025

వరంగల్: తగ్గిన ఎంపీటీసీ, జడ్పటీసీ స్థానాలు!

image

వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్య తగ్గింది. రాబోయే ఎన్నికల కోసం ఇటీవల పంచాయతీ రాజ్ అధికారులు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల మార్పులను ప్రభుత్వానికి పంపించారు. గత ఎన్నికల్లో 16 జడ్పీటీసీ, 178 స్థానాలు ఉండేవి. హనుమకొండ, వరంగల్ జిల్లాల పునర్విభజన, ఇటీవల నర్సంపేట మున్సిపాలిటీలో 8 గ్రామాల విలీనమయ్యాయి. దీంతో వరంగల్ జిల్లాలో మొత్తం 130 ఎంపీటీసీ, 11 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.

error: Content is protected !!