News March 3, 2025
వరంగల్: ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురూ

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ఉ. 8 గంటలకు ప్రారంభమవుతోంది. 25 టేబుళ్లలో ఒక్కో టేబుల్పై వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి టేబుల్ వద్ద పోటీలో ఉన్న 19 మంది అభ్యర్థులు చూసుకునేలా 19 గడీలు కలిగిన ర్యాక్స్ను ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఓటు వెయ్యకపోతే దాన్ని ఏజెంట్లు అందరికీ చూపి పక్కన పెడతారు. అలా మొదటి రౌండ్ కౌంటింగ్ మధ్యాహ్నం 3 గంటల కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది.
Similar News
News July 4, 2025
ఈ ఇన్నింగ్స్ గిల్కు ఎంతో స్పెషల్.. నెట్టింట చర్చ

ఇంగ్లండ్పై రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 269 పరుగులు చేసి ఔరా అనిపించారు. అయితే, ఈ ఘనతను రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్యాప్ నంబర్తో పోల్చుతూ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. తన అభిమాన క్రికెటర్ కోహ్లీ క్యాప్ నంబర్ 269 కావడంతో ఈ ఇన్నింగ్స్ గిల్కు ఎంతో స్పెషల్ అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కోహ్లీ తనకు ఆదర్శమని, ఆయనలా రాణించాలని కోరుకుంటున్నట్లు గిల్ చెప్పుకొచ్చారు.
News July 4, 2025
అల్లూరి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేద్దాం: ఇన్ఛార్జ్ కలెక్టర్

పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రజలకు సేవలు చేయాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య సూచించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా యువజన సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెట్కూరు సీఈవో వేణుగోపాల్, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
News July 4, 2025
మహనీయుల సేవలను స్మరించుకోవాలి: కలెక్టర్

మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో
శుక్రవారం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి, పింగళి వెంకయ్య వర్ధంతి కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఇరువురి మహనీయుల చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.