News September 21, 2025

వరంగల్: ఎడ్లబండి ఏడుస్తోంది..!

image

కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతోంది. దీంతో వ్యవసాయానికి వాడే పనిముట్లను పక్కనబెట్టి యంత్రాలను వాడుతుండటంతో వాటినే నమ్ముకొని బతుకుతున్న వడ్రంగి వృత్తి వారికి ఉపాధి లేకుండా పోతోంది. దీంతో ఎడ్ల బండ్లు, నాగళ్లు కనుమరుగయ్యాయి. గ్రామాల్లో ఎక్కడో ఒకచోట మాత్రమే ప్రస్తుతం ఎడ్లబండ్లు కనిపిస్తున్నాయి. మానుకోట జిల్లా కౌసల్యాదేవిపల్లిలో ఓ రైతన్న ఎడ్లబండిని తీసుకెళ్తుండగా Way2News చిత్రీకరించింది.

Similar News

News September 21, 2025

అమెరికాలో వరంగల్ వాసుల బతుకమ్మ సంబరాలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అమెరికా వెళ్లి న్యూయార్క్ సిటీలో స్థిరపడ్డ వారు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. అమెరికా తెలుగు సంఘం ప్రతినిధి రమ బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. అమెరికాలోను తెలంగాణ సంప్రదాయాలను కొనసాగిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను రూపొందించి అట, పాటలతో కోలాహలంగా సందడి చేశారు.

News September 21, 2025

HYD: ‘కమీషన్ల కోసం దొంగ టిక్కెట్లు..!’

image

గ్రేటర్ HYD వ్యాప్తంగా రోజుకు 26 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో మహాలక్ష్మి ప్రయాణాలు 72% ఉన్నట్లు తెలిపారు. అనేక డిపోలకు టార్గెట్లు నిర్ణయించగా కొంత మంది కండక్టర్లు కమీషన్ల కోసం దొంగ టికెట్లు కొడుతున్నట్లు గుర్తించి పలుచోట్ల హెచ్చరించినట్లు అధికారులు చెప్పారు.

News September 21, 2025

HYD: ‘కమీషన్ల కోసం దొంగ టిక్కెట్లు..!’

image

గ్రేటర్ HYD వ్యాప్తంగా రోజుకు 26 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో మహాలక్ష్మి ప్రయాణాలు 72% ఉన్నట్లు తెలిపారు. అనేక డిపోలకు టార్గెట్లు నిర్ణయించగా కొంత మంది కండక్టర్లు కమీషన్ల కోసం దొంగ టికెట్లు కొడుతున్నట్లు గుర్తించి పలుచోట్ల హెచ్చరించినట్లు అధికారులు చెప్పారు.