News February 25, 2025

వరంగల్: ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన డీసీపీ 

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో వరంగల్ రంగశాయిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కేంద్రాన్ని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల వేళ చేపట్టాల్సిన బందోబస్తుతో పాటు మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై డీసీపీ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించడంతో పాటు ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లకు పలు సూచనలు చేశారు.

Similar News

News February 25, 2025

సంగారెడ్డి: ప్రజా పోరాటాల వేదిక జిల్లా కన్వీనర్‌గా రాజయ్య

image

ప్రజా పోరాటాల వేదిక జిల్లా కన్వీనర్‌గా రాజయ్యను సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజయ్య మాట్లాడుతూ.. తనను జిల్లా కన్వీనర్‌గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తారని పేర్కొన్నారు. జిల్లా కన్వీనర్‌గా నియామకమైన రాజయ్యను సన్మానించారు.

News February 25, 2025

నల్గొండ జిల్లా టాప్ న్యూస్

image

⏭ దామరచర్లలో దొంగ నోట్ల కలకలం ⏭ పీఏ పల్లిలో మహిళా దారుణ హత్య ⏭ వైద్య సిబ్బందిని బెదిరిస్తే కేసులు: ఎస్పీ శరత్ చంద్ర పవర్ ⏭ రిజిస్టర్ ఓటర్లకు సెలవు: కలెక్టర్ ఇలా త్రిపాఠి ⏭ ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి: డాక్టర్ సుచరిత ⏭ శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు ⏭ గుర్రంపోడు ఎమ్మార్వోని సస్పెండ్ చేసిన కలెక్టర్ 

News February 25, 2025

రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలను తప్పుగా తీసుకోవద్దు: జగ్గారెడ్డి

image

ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని కొందరు రెడ్డి సామాజిక వర్గంపై చేసిన విమర్శల్ని తప్పుగా తీసుకోవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. వాళ్ల మాటలు పట్టించుకోని పార్టీ పట్ల వ్యతిరేక భావన కలిగి ఉండవద్దన్నారు. రెడ్డి సామాజిక వర్గం ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వం స్థానంలో ఉందని అందరూ ఓపిగ్గా ఉండాలని కోరారు.

error: Content is protected !!