News July 7, 2025
వరంగల్: కోరికలు తీరాలని తాళం వేస్తారు!

ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన సాంప్రదాయం ఉంటుంది. అలాగే, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ దర్గాలో యాకుబ్ షావలి బాబా దర్శనానికి వచ్చే భక్తులు తమ కోరికలు తీరాలని దర్గాలోని గ్రిల్స్కు తాళం వేస్తారు. కోరికలు నెరవేరిన అనంతరం దర్గాలో మొక్కులు చెల్లించుకుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి కులమతాలకతీతంగా వచ్చే భక్తులు ఈ ఆనవాయితీని పాటిస్తుండటం విశేషం. ప్రతి శుక్రవారం, ఆదివారం భక్తులు కిక్కిరుస్తారు.
Similar News
News July 7, 2025
వరంగల్: వారికి పెన్షన్లు ఎప్పుడు వచ్చెనో..?

ఉమ్మడి జిల్లాలో పలువురు దివ్యాంగులకు ఏళ్ల తరబడి పెన్షన్లు అందడం లేదు. గతంలో జిల్లా స్థాయి మెడికల్ బోర్డులో తిరస్కరించగా.. దానిపై రాష్ట్ర మెడికల్ బోర్డుకు కొందరు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 375, జనగామలో 90 అప్పీళ్లు ఉన్నాయి. HNK, BHPL, WGL, ములుగులోను వంద లోపు అప్పీళ్లు వచ్చాయి. వాటిని పరిష్కరించి, పథకాలకు అర్హులుగా అయ్యేలా చూడాలని దివ్యాంగులు కోరుతున్నారు.
News July 7, 2025
MBNR: ఆ ప్రాంతాల్లో 15 చిరుతల సంచారం.. ప్రజలు అప్రమత్తం

మహబూబ్ నగర్, మహమ్మదాబాద్ మండలాలోని అటవీ ప్రాంతాల్లో సుమారు 15 చిరుతల మేర సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. గాధిర్యాల్ లోని కొణెంగల గుట్టపై చిరుత సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో ఫారెస్ట్ అధికారులు లావణ్య, శ్రీనివాస్, సిబ్బంది కొణెంగల గుట్టకు వెళ్లి పరిశీలించారు. కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేంజ్ అధికారి అబ్దుల్ హై పేర్కొన్నారు.
News July 7, 2025
జీకేవిధి: థాంక్యూ లోకేశ్ సార్..!

అల్లూరి జిల్లా జికేవీధి మండలం రింతాడ గిరిజన సంక్షేమ పాఠశాల బాలికలు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన యోగేంద్ర కార్యక్రమంలో గిరిజన బాలబాలికలు పాల్గొని గిన్నిస్ రికార్డు నమోదు చేయడానికి భాగస్వామ్యులయ్యారు. ఈ మేరకు గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు మంత్రి లోకేష్ టీ షర్ట్లు యోగ సామగ్రి పంపించారు. రింతాడలో సోమవారం ఆ టీ షర్ట్స్ ధరించిన విద్యార్థినిలు కృతజ్ఞతలు తెలిపారు.