News October 10, 2025
వరంగల్: గంజి, గటకే వారి కడుపునింపింది!

‘ఏళ్ల తరబడి కూడుకేడ్చాం.. గూడుకేడ్చాం.. గుడ్డకేడ్చాం’ అనే ఓ సినామాలోని డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎనకటి రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లక్షలమంది తినడానికి తిండిలేక అనేక అవస్థలు పడ్డారు. గటక, గంజి తాగి ఏళ్ల తరబడి బతికారు. పండగ రోజు మాత్రమే అన్నం తినేవారు. మిగతా రోజుల్లో గంజి మాత్రమే వారి ఆహారం. అందులోని పోషకాలతో నేటికీ ఆరోగ్యంగా ఉండటం విశేషం. నేడు ప్రపంచ గంజి దినోత్సవం. SHARE IT.
Similar News
News October 10, 2025
మరియాకు నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్కు నిరాశ

2025కి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోను వరించింది. డెమొక్రటిక్ రైట్స్, శాంతి కోసం ఆమె చేసిన కృషిని గుర్తించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. వెనిజులాను ఆమె డిక్టేటర్షిప్ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించారు. అటు ఈ ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నిరాశే మిగిలింది.
News October 10, 2025
ఏ ఒక్క పత్తి రైతూ నష్టపోకుండా చూడాలి: VZM జేసీ

ఏ ఒక్క పత్తి రైతు నష్టపోకుండా చూడాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాదవన్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ ఛాంబర్లో శుక్రవారం జరిగింది. పత్తి రైతు ఈ-క్రాప్ కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటా రూ. 8,110గా నిర్ణయించిందని, ఈ విషయాన్ని RSKల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
News October 10, 2025
గద్వాల్: సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి

సమాచార హక్కు చట్టం ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించడం జరిగిందని, ఈ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఈనెల 5 నుంచి 12 వరకు ఆర్టీఐ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం గద్వాల ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లా అధికారులకు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడారు.