News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News November 12, 2025
భారీ ఉగ్రకుట్ర.. భగ్నం చేసింది తెలుగోడే

జైషే మొహ్మద్ భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం చేసింది తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి. కర్నూలుకు చెందిన సందీప్ 2014 IPS ఆఫీసర్. చాలాకాలంగా కశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో సమర్థంగా విధులు నిర్వర్తించి ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ పొందారు. గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి, CC కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారించారు. దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది.
News November 12, 2025
HYD: సత్యసాయి భక్తులకు గుడ్ న్యూస్

సత్యసాయిబాబా భక్తులకు ఆర్టీసీ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. ఈనెల 23న పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలకు వెళ్లే గ్రేటర్ HYD వాసులకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నామన్నారు. ఈనెల 22న సాయంత్రం బస్సు బయలుదేరుతుంది. వేడుకలు ముగిసిన అనంతరం 23న సాయంత్రం పుట్టపర్తి నుంచి సిటీకి బయలుదేరుతుందని డిపో-1 మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. 73828 24784 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.
News November 12, 2025
HYD: సత్యసాయి భక్తులకు గుడ్ న్యూస్

సత్యసాయిబాబా భక్తులకు ఆర్టీసీ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. ఈనెల 23న పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ వేడుకలకు వెళ్లే గ్రేటర్ HYD వాసులకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నామన్నారు. ఈనెల 22న సాయంత్రం బస్సు బయలుదేరుతుంది. వేడుకలు ముగిసిన అనంతరం 23న సాయంత్రం పుట్టపర్తి నుంచి సిటీకి బయలుదేరుతుందని డిపో-1 మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. 73828 24784 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.


