News April 16, 2025
వరంగల్: చాక్లెట్ కోసం వెళ్లి అనంత లోకాలకు..

చెన్నారావుపేట మం. పుల్లయ్యబోడు తండాలో మంగళవారం <<16107593>>టిప్పర్ ఢీకొని<<>> రెండో తరగతి విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన వెంకన్న-జ్యోతికి కూతురు, కొడుకు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన కొడుకు అనిల్(8) చాక్లెట్ కొనుక్కోవడానికి షాప్కు వెళ్లాడు. నెక్కొండ నుంచి వస్తున్న టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొట్టడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News February 18, 2026
కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

కృష్ణా జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఓపెన్ స్కూల్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం అధికారులతో సమీక్షించారు. విద్య, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని సూచించారు.
News February 18, 2026
వయో వ్రతం ఎలా చేయాలి?

వయో వ్రతం ఫాల్గుణ శుక్ల పక్ష పాడ్యమి నుంచి ద్వాదశి వరకు 12 రోజులు సాగుతుంది. ఈ సమయంలో పాలు మాత్రమే తీసుకుంటారు. అందుకే ‘పయోవ్రతం’ అనే పేరొచ్చిందంటారు. వ్రతంలో భాగంగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి, లక్ష్మీనారాయణులను షోడశోపచారాలతో పూజించాలి. బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపై పడుకోవాలి. ద్వాదశి నాడు పూర్ణాహుతితో వ్రతం ముగించాలి. అన్నదానం చేయాలి. నియమ నిష్టలతో చేసే ఈ పూజ అనంత పుణ్యఫలాన్ని ఇస్తుంది.
News February 18, 2026
పాలమూరు: పెళ్లిళ్ల సీజన్.. RTC గుడ్న్యూస్

ఫాల్గుణ మాసం నేపథ్యంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు ఈనెల 18 నుంచి అద్దెకు ఇస్తున్నట్లు మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రతి కిలోమీటర్పై గతంలో కంటే రూ.7/- భారీ తగ్గింపు, 6 గంటల వెయిటింగ్ ఛార్జి మినహాయింపు ఉంటుందని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు చేసుకోవాలని కోరారు.
SHARE IT


