News October 16, 2024

వరంగల్ జిల్లాలో ఏరులై పారిన మద్యం

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం ఏరులై పారింది. ఈ దసరా పండుగకు రూ.142 కోట్లతో ఎక్సైజ్ ఖజానకు వరంగల్ జిల్లా మందుబాబులు భారీగా ఆదాయాన్ని తీసుకొచ్చారు. గతేడాది రూ.94 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి అదనంగా మరో రూ.50 కోట్ల వరకు ఆదాయం పెరిగింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 294 వైన్స్, 134 బార్లు ఉండగా.. పండుగకు 1,29,740 మద్యం కాటన్లు, 2,53,666 బీర్ల కాటన్లు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 6, 2025

కళాశాలలను తనిఖీ చేసిన డీఐఈఓ శ్రీధర్ సుమన్

image

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు, రికార్డుల నిర్వహణలో ఇంటర్ బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని DIEO శ్రీధర్ సుమన్ సూచించారు. ఖానాపూర్ మోడల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, నర్సంపేట ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ కళాశాలలను DIEO తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ అభ్యసన తరగతులు నిర్వహించాలన్నారు.

News November 6, 2025

వరంగల్ మార్కెట్ సందర్శించిన కలెక్టర్

image

వరంగల్ కలెక్టర్ డా. సత్యశారదా దేవి గురువారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ని సందర్శించారు. ఆమె మార్కెట్లోని రైతులు, వ్యాపారస్తులతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 5తేదీలోపు తమ సమస్యల పరిష్కరించకపోతే పత్తి కొనుగోలు చేయమని వ్యాపారులు తెలిపిన నేపథ్యంలో వారితో మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు.

News November 5, 2025

ఎస్సీ విద్యార్థులకు గుడ్‌న్యూస్: రూ.3,500 స్కాలర్‌షిప్

image

జిల్లాలోని 9వ, 10వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ తరఫున వారికి రూ.3,500 స్కాలర్‌షిప్‌ను మంజూరు చేయనున్నట్లు ఆ శాఖ అధికారి భాగ్యలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు తమ విద్యార్థుల వివరాలను https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో తప్పక నమోదు చేయాలని ఆమె ఆదేశించారు.