News March 10, 2025

వరంగల్ జిల్లాలో ప్రమాదకరంగా SRSP

image

తీగరాజుపల్లి వద్ద గల SRSP కాలువలో పడి మేచరాజుపల్లికి చెందిన ముగ్గురు శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన జరగడం రెండోసారి కావడంతో జిల్లా ప్రజలు భయపడుతున్నారు. జిల్లాలోని అక్కడక్కడ SRSP కాలువ పక్కన గల రహదారులు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రయాణికులు,స్థానికులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Similar News

News April 2, 2026

అమరావతి శంకుస్థాపన ప్రదేశానికి నేడు సీఎం రాక

image

అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఉద్దండరాయునిపాలెంలో 2015 అక్టోబర్ 22న ప్రధాన మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు అమరావతి ప్రాంతంలోని రైతులు, రైతు కూలీలు ఉద్దండరాయపాలెం శంకుస్థాపన ప్రదేశానికి చేరుకుంటున్నారు.

News April 2, 2026

గుడిబండ తహశీల్దార్ ఇంట్లో సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు

image

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ తహశీల్దార్ శ్రీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి అక్రమ ఆస్తులను గుర్తించారు. తనిఖీల్లో రూ.55 లక్షల నగదు, 221 గ్రాముల బంగారం, 685 గ్రాముల వెండి, రూ.24 లక్షల బ్యాంకు డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పలు ఇళ్ల పత్రాలు కూడా లభించాయి. నిందితుడిని నేడు కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

News April 2, 2026

ముగిసిన సీఎం చంద్రబాబు పర్యటన…

image

ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణంలో పాల్గొనేందుకు కడప జిల్లాకు విచ్చేసిన సీఎం చంద్రబాబు తన పర్యటనను ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. రామయ్య కళ్యాణం ముగిసిన అనంతరం ఒంటిమిట్టలో ఆయన రాత్రి బస చేశారు. ఇవాళ ఉదయం ఒంటిమిట్టలోని హెలిపాడ్ వద్ద నుంచి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లారు. ఆయనకు కలెక్టర్ శ్రీధర్, డీఐజీ కోయ ప్రవీణ్, ఇతర ప్రజాప్రతినిధులు వీడ్కోలు పలికారు.