News May 7, 2025

వరంగల్ జిల్లాలో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఖిలా వరంగల్-42.6, ములుగు రోడ్డు-42.9, సీరోలు(MHBD)-42.4, జఫర్‌గడ్(జనగామ)-42.8, కన్నాయిగూడెం(ములుగు)-43.2, ములుగు 42.5గా నమోదయ్యాయి. మీ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News April 13, 2026

త్వరలో హెల్త్ ఏటీఎంలు.. 130 రకాల పరీక్షలు!

image

TG: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతోంది. కొన్ని నిమిషాల్లోనే 130 రకాల ఆరోగ్య పరీక్షలు చేసే మెషీన్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో 2 ఆస్పత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన యంత్రాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. BP, ECG, BMI, షుగర్, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ ఫంక్షనింగ్, థైరాయిడ్‌ తదితర టెస్టులు వీటితో చేసుకోవచ్చు.

News April 13, 2026

ఈ నెల 30 దాకా రేషన్ పంపిణీ!

image

TG: 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో రేషన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు తీసుకోకపోతే మళ్లీ 3 నెలల వరకు ఇవ్వరని ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే క్యూలైన్లు కనిపిస్తున్నాయి. సర్వర్ సమస్యలు, ఈపోస్ మెషీన్లు ఆగిపోవడం, స్టాక్ అయిపోవడంతో చాలా మందికి ఇంకా రేషన్ అందలేదు. దీంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఈ నెల 30 దాకా రేషన్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు.

News April 13, 2026

తూప్రాన్: తల్లిదండ్రులకు విజయాన్ని అంకితం చేసిన శ్రావణి

image

తూప్రాన్ ఎంజేపీ బాలికల కళాశాల విద్యార్థిని శ్రావణి ఇంటర్ ఎంపీసీలో 950 మార్కులతో సత్తా చాటింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా.. పట్టుదలతో చదివి ఈ విజయం సాధించింది. టెన్త్ బోనాల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసిన శ్రావణి.. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంటర్‌లో రాణించింది. తన విజయాన్ని అమ్మానాన్నలకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని శ్రావణి పేర్కొంది.