News February 8, 2025
వరంగల్: తగ్గిన ఎంపీటీసీ, జడ్పటీసీ స్థానాలు!

వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్య తగ్గింది. రాబోయే ఎన్నికల కోసం ఇటీవల పంచాయతీ రాజ్ అధికారులు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల మార్పులను ప్రభుత్వానికి పంపించారు. గత ఎన్నికల్లో 16 జడ్పీటీసీ, 178 స్థానాలు ఉండేవి. హనుమకొండ, వరంగల్ జిల్లాల పునర్విభజన, ఇటీవల నర్సంపేట మున్సిపాలిటీలో 8 గ్రామాల విలీనమయ్యాయి. దీంతో వరంగల్ జిల్లాలో మొత్తం 130 ఎంపీటీసీ, 11 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.
Similar News
News November 2, 2025
గీసుకొండ: ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

గీసుకొండ మండలం మొగిలిచర్లలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అప్ప నాగరాజు (34) అనే ఆటో డ్రైవర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ పరిస్థితులు దిగజారడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
News November 2, 2025
సంగెం: గుంతలో పడి వృద్ధుడి మృతి

సంగెం మండలం లోహిత గ్రామంలోని నల్లాల గేట్వాల్ సమీపంలో ఉన్న గుంతలో పడి గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 ఏళ్లు) మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి గుర్తింపు కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
News November 2, 2025
వరంగల్: కబ్జాలతో కష్టాలు

వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. దీనికి ప్రధాన కారణం వర్షం కాదని, నాలాలు, కాలువలు, చెరువులపై జరుగుతున్న ఆక్రమణలేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు నగరానికి అందాన్ని తెచ్చిన 170కి పైగా చెరువులు, కుంటలు ఇప్పుడు అర్ధభాగం వరకు మాయం అయ్యాయని, మురికి కాలువలపై కొందరు అక్రమార్కులు భవనాలు, షాపులు నిర్మించుకుని ప్రజా భద్రతను సవాల్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.


