News December 31, 2025
వరంగల్: తరలివచ్చిన చిరుధాన్యాలు.. పెరిగిన ధరలు

WGL ఎనుమాముల మార్కెట్కి ఈరోజు చిరుధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో నిన్నటితో పోలిస్తే నేడు ధరలు పెరిగాయి. సూక పల్లికాయ క్వింటాకి నిన్న రూ.8,490 ధర రాగా.. ఈరోజు రూ.8,550 ధర వచ్చింది. పచ్చి పల్లికాయ నిన్న రూ.5,400 ధర పలికితే.. నేడు రూ.5,600 పలికింది. అలాగే, క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,050 ఉండగా, ఈరోజు రూ.2,055 అయింది. ఎల్లో రకం మిర్చికి రూ.23వేలు, పసుపుకి రూ.13,200 ధర వచ్చాయి.
Similar News
News January 3, 2026
ఇవాళ సూపర్ మూన్.. ఎన్ని గంటలకంటే?

ఇవాళ సూపర్ మూన్ కనువిందు చేయనుంది. పౌర్ణమి సందర్భంగా 6PM నుంచి కనిపించనుంది. సాధారణం కంటే 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగానే వీక్షించవచ్చు. ఆ సమయంలో ఎర్త్కు 3.6 లక్షల KM దూరంలో చందమామ ఉంటాడట. భూమికి దగ్గరగా చంద్రుడు రావడం, అదే టైమ్లో సూర్యుడికి భూమి దగ్గరగా ఉండటం, సూర్యుడికి చంద్రుడు పూర్తి ఎదురుగా రావడంతో సూపర్ మూన్ వెలిగిపోనుంది.
News January 3, 2026
కొడుకు, కోడలు క్యూట్ ఫొటో షేర్ చేసిన ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ కొడుకు రైహాన్ త్వరలో <<18710916>>పెళ్లి<<>> చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడుకు, కాబోయే కోడలు క్యూట్ ఫొటోలను ఆమె షేర్ చేశారు. వారిద్దరూ మూడేళ్ల వయసు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. ‘మీ ఇద్దరినీ ఎంతో ప్రేమిస్తున్నా. ఎల్లప్పుడూ ఒకరినొకరూ ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ ఉండండి. మూడేళ్ల వయసు నుంచీ ఉన్నట్లే ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్గా కొనసాగండి ’ అని రాసుకొచ్చారు.
News January 3, 2026
HNK:అవమానం భరించలేక యువకుడి సూసైడ్

అవమానం భరించలేని యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పరమేశ్వర్ కథనం ప్రకారం.. HNK జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లికి చెందిన మేకల బన్నీ(19) తన అక్క భర్త గణేష్, మామ, వారి బంధువు భాస్కర్ దుర్భాషలాడి దాడి చేయడంతో అవమానం భరించలేకపోయాడు. ఈ క్రమంలో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు అయింది.


