News February 5, 2025

వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి

image

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

Similar News

News November 4, 2025

గిరిజన గూడెంలోని అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో పీఎం ఉజ్వల యోజన కింద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, గిరిజన గూడెంలోని అందరికీ గ్యాస్ కనెక్షన్లు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భైర్లూటి గూడెం, గులాం అలియాబాద్ తాండాలలో ఏర్పాటైన నైపుణ్య కేంద్రాల ద్వారా యువతకు ఉపాధి కల్పించాలన్నారు. వసతి గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

News November 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 56 సమాధానాలు

image

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి ‘పరుశరాముడు’.
2. మేఘనాదుడు ‘తమ కుటుంబ దేవత అయిన నికుంభి’లను పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు.
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ‘శ్రవణం’.
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ‘ద్వాదశి’.
5. సీత స్వయంవరం లో ఉన్న శివ ధనుస్సు అసలు పేరు ‘పినాక’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 4, 2025

రాంపూర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నిర్మల్ ఎస్పీ

image

నర్సాపూర్(జి) మండలం రాంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, మంగళవారం పరిశీలించారు. ఆమె ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానిక అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్య డ్రైవింగ్ చేయొద్దని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు.