News February 5, 2025
వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News November 3, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్బ్రాంతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాపూర్ గేటు వద్ద ఆర్టీసి బస్సు ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. కంకర లోడ్తో ఉన్న టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారన్నారు.
News November 3, 2025
పల్నాడులో అమరావతి ORR భూసేకరణకు నోటిఫికేషన్

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో పల్నాడు జిల్లాకు సంబంధించి కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 478.38 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. అమరావతి తాలూకాలోని లింగాపురం, ధరణికోట గ్రామాల్లో భూమిని సేకరిస్తారు. పెదకూరపాడు తాలూకాలోని ముస్సపురం, పాటిబండ్ల, జలాలపురం, కంభం పాడు, తల్లూరు, లింగంగుంట్ల, బలుసుపాడు గ్రామాల్లో భూసేకరణ జరగనుంది.
News November 3, 2025
మీర్జాగూడ ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

TG: మీర్జాగూడ<<18183462>> ప్రమాదంలో<<>> మృతులంతా చేవెళ్ల వాసులేనని తెలుస్తోంది. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగులే ఉన్నారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సహాయక చర్యల పర్యవేక్షణకు సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కాంటాక్ట్ నం: 9912919545, 9440854433.


