News September 11, 2025
వరంగల్: తెల్ల కాగితం.. పట్టా రూపం..!

తెల్ల కాగితంపై భూమి కొనుగోలు చేసిన రైతులకు పట్టా రూపంగా పాసుబుక్ ఇచ్చేందుకు మార్గం సుగుమమైంది. తాజాగా భూభారతి చట్టంలోని సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ద్వారా దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12-10-2020 నుంచి 10-11-2020 మధ్య అనధికార భూలావాదేవీలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించాలని సూచించింది. ఉమ్మడి WGL జిల్లాలో 1,79,697 సాదాబైనామా దరఖాస్తులు రాగా కొంత మందికి మేలు జరగనుంది.
Similar News
News September 11, 2025
TTD బోర్డు సభ్యుడిగా సుదర్శన్ వేణు నియామకం

TTD బోర్డు సభ్యుడిగా సుదర్శన్ వేణును నియమిస్తూ దేవాదాయశాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి ఎం హరి జవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 29 మంది సభ్యులతో టీటీడీ బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. వీరిలో సభ్యునిగా బాధ్యత తీసుకోని జస్టిస్ హెచ్ ఎల్ దత్తు స్థానంలో తాజాగా సుదర్శన్ వేణును నియమించారు. సభ్యుడి మిగిలి ఉన్న కాలానికి మాత్రమే సుదర్శన్ వేణు పదవిలో ఉంటారని పేర్కొన్నారు.
News September 11, 2025
శిథిలావస్థ గదుల్లో తరగతులు నిర్వహించవద్దు: డీఈఓ

జిల్లాలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో విద్యార్థులకు బోధన నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. పాఠశాలల్లో ప్రమాదకరంగా ఉన్న గదుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు తప్పక గమనించాలని సూచించారు. విద్యార్థుల భద్రతే ప్రధానమని, ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న గదుల్లో తరగతులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.
News September 11, 2025
సంగారెడ్డి: NMMS స్కాలర్షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(NMMS) ఉపకార వేతనాలకు 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి డీఈవో వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. అక్టోబర్ 6వ తేదీ వరకు www.bse.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు మాత్రమే ఈ ఉపకార వేతనాలకు అర్హులని పేర్కొన్నారు.