News February 28, 2025

వరంగల్: దశాబ్ద కాలం కోరిక నెరవేరింది: మంత్రి సురేఖ

image

వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జిల్లా వాసులకు దశాబ్ద కాలం కోరిక నెరవేరిందని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఇది సీఎం రేవంత్, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వరంగల్ జిల్లా ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఓరుగల్లు వాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేసిందన్నారు.

Similar News

News November 6, 2025

అన్ని కార్యాలయాల్లో రేపు సామూహిక వందేమాతరం

image

బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయాలని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7 జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో సామూహిక గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 10 గంటలకు వందేమాతర గీతాన్ని సామూహికంగా ఆలపించాలని కలెక్టర్ సూచించారు.

News November 6, 2025

‘ఉచితం, తక్కువ లాభం’ అంటే మోసమే: ఏసీపీ

image

సైబర్ నేరాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. సైబర్ జాగృతి దివస్ సందర్భంగా సిద్దిపేట మెడికల్ కళాశాల విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం పేరుతో భయపెడుతూ, మభ్యపెడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉచితం లేదా తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందంటే అది మోసమే అని గ్రహించాలని ప్రజలకు ఏసీపీ సూచించారు.

News November 6, 2025

20 ఏళ్ల తరువాత తొలిసారి అక్కడ పోలింగ్

image

బిహార్ భీమ్‌బంద్ ప్రాంతంలోని 7 పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రజలు 20 ఏళ్ల తరువాత తొలిసారి ఓట్లు వేశారు. 2005 JAN 5న తారాపూర్‌ దగ్గర భీమ్ బంద్ ప్రాంతంలో నక్సల్స్ పోలీసులు లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. పేలుడులో ముంగేర్ SP సురేంద్ర బాబు, ఆరుగురు పోలీసులు చనిపోయారు. అప్పటి నుంచి అధికారులు అక్కడ పోలింగ్ నిర్వహించడం లేదు. ఈసారి సాయుధ దళాలను మోహరించి పోలింగ్ జరిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేశారు.