News September 16, 2025

వరంగల్: నేటి నుంచి ఆరోగ్య సేవలు బంద్..!

image

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవల కింద బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో 72 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు రోగులకు అందుబాటులో ఉండవు. కావున ప్రజలు సహకరించాలని కోరారు.

Similar News

News September 16, 2025

ADB: మొదలై వెంటనే ముగిసిన ఓ తల్లి విషాద గాథ..!

image

సిరికొండ మండలం బీంపూర్‌కు చెందిన తోడసం ఏత్మ భాయి(20) ప్రసవం తర్వాత మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈనెల 12న పురిటి నొప్పులతో ఆమెను ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, బాలుడికి జన్మనిచ్చింది. 14వ తేదీన డిశ్చార్జ్ అయ్యాక తీవ్రమైన తలనొప్పి రావడంతో 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News September 16, 2025

నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. MSC స్టాటిస్టిక్స్‌లో 45 మందికి గాను.. 44 మంది మంది ఉత్తీర్ణులయ్యారు. బయోకెమిస్ట్రీలో 24 మందిలో 17 మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు తెలిపారు. ఫలితాలపై అభ్యంతరాలున్నవారు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. రీవాల్యూయేషన్‌ కోసం రూ.1860, వ్యక్తిగత పేపర్‌ వెరిఫికేషన్‌ కోసం రూ.2190 చెల్లించాలన్నారు.

News September 16, 2025

JGTL: ఎస్‌ఐఆర్ నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలి

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఎస్‌ఐఆర్ నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. 2002 ఎస్‌ఐఆర్, 2025 ఎస్‌ఎస్‌ఆర్ డేటాను పోల్చి డూప్లికేట్ ఓట్లు తొలగించి క్షేత్ర స్థాయిలో ధృవీకరించాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఆర్డీవోలు, బీఎల్ఓ సూపర్వైజర్లతో రెగ్యులర్ మీటింగులు జరిపి ప్రతిరోజు లక్ష్యాలు నిర్దేశించాలని VCలో చెప్పారు. VCలో కలెక్టర్ బీ.సత్యప్రసాద్ సహా అధికారులు పాల్గొన్నారు.