News October 9, 2025

వరంగల్: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ..!

image

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వని నేపథ్యంలో ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు నోటిఫికేషన్ రాగానే నామినేషన్లను స్వీకరించనున్నారు. జిల్లాలో మొదటి విడత గీసుగొండ, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, పర్వతగిరి మండలాలకు ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు. 11న నామినేషన్లకు చివరి తేదీ కాగా, 23న పోలింగ్ జరగనుంది.

Similar News

News October 8, 2025

స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: వరంగల్ కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 23, 27 తేదీల్లో, అలాగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నవంబర్ 4, 8 తేదీల్లో జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని మొత్తం 317 గ్రామ పంచాయతీల్లో గల 2,754 వార్డులకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News October 8, 2025

ప్రభుత్వ కళాశాలల్లో వంద శాతం ఎఫ్ఆర్ఎస్ నమోదు: డీఐఈఓ

image

వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు(రిజిస్ట్రేషన్) వంద శాతం పూర్తి చేసినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1191 ప్రథమ సం., 959 ద్వితీయ సం. మొత్తం 2,150 మందికి గాను 2150 మంది విద్యార్థులు, 187 మంది సిబ్బంది పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు తెలిపారు. ముఖ గుర్తింపు హాజరు రిజిస్ట్రేషన్‌లో వరంగల్ జిల్లా ముందంజలో ఉందన్నారు.

News October 8, 2025

భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని ఆమె స్పష్టం చేశారు. నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో భూభారతి అమలుపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.