News June 28, 2024
వరంగల్: నేటి పత్తి ధర ఎంతంటే?
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర మళ్లీ తగ్గింది. నేడు క్వింటా పత్తికి రూ.7,160 ధర వచ్చింది. 3 రోజులుగా పత్తి ధరలు చూస్తే బుధవారం రూ.7,090, గురువారం రూ.7,210కి పలికాయి. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు రూ.50 తగ్గింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
Similar News
News September 20, 2024
వరంగల్: తగ్గుతున్న పత్తి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు మళ్లీ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. బుధవారం రూ.7,810కి పడిపోయింది. గురువారం కొంత పెరిగి రూ. 7,850 చేరగా నేడు మళ్లీ తగ్గి రూ.7,825 అయిందని అధికారులు తెలిపారు. పత్తి ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.
News September 20, 2024
కేయూ కాంట్రాక్టు లెక్చరర్పై మరో ఫిర్యాదు
కేయూ కాంట్రాక్టు లెక్చరర్ శ్రీధర్ కుమార్ లోథ్పై మరో మహిళ పార్ట్ టైమ్ లెక్చరర్ ఫిర్యాదు చేశారు. బదిలీ విషయంలో వేధిస్తూ అడ్డుకుంటున్నాడని తెలుగు డిపార్ట్మెంట్ లెక్చరర్ అన్నపూర్ణ అతడిపై గురువారం రిజిస్ట్రార్కు ఫిర్యాదు ఇచ్చారు.కాగా ఈ నెల 16న తెలుగు డిపార్ట్మెంట్ HOD జ్యోతి తనను శ్రీధర్ కుమార్ లోథ్ మానసికంగా వేధిస్తున్నాడని రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే అతడికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
News September 20, 2024
మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేత
రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో సింథటిక్ శాలువాలు వాడకుండా చేనేత శాలువాలు, చేనేత బ్యాగులు వాడేలా ఆదేశాలు ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. అనంతరం దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రి కొండా సురేఖతో నేతలు చర్చించారు.