News December 14, 2025
వరంగల్: నేడే ఎన్నికలు.. 508 జీపీలకు ఎన్నికలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 27 మండలాల్లోని 564 జీపీల్లో 56 ఏకగ్రీం కాగా, మిగతా 508 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి 1,686 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 4,937 వార్డుల్లో 917 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 4,020 వార్డులకు 9,884 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.
Similar News
News December 15, 2025
కోనసీమ: కొబ్బరి రైతులకు కేంద్రం తీపి కబురు

కొబ్బరికి మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. మిల్లింగ్ కొబ్బరికి క్వింటా రూ.445, బంతి కొబ్బరికి రూ.400 మద్దతు ధర పెంచారు. ఈ పెంపుతో మిల్లింగ్ కొబ్బరి ధర క్వింటా రూ.12,027, బంతి కొబ్బరి ధర రూ.12,500కు పెరిగింది. జిల్లాలో సుమారు 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. మద్దతు ధర పెంపుతో ధరలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
News December 15, 2025
‘అనకాపల్లి జిల్లాలో రబీ సీజన్లో 15,630 హెక్టార్లలో పంటల సాగు’

అనకాపల్లి జిల్లాలో ఈ ఏడాది రబీలో 15,630 హెక్టార్లలో పంటల సాగుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి అనుగుణంగా 14,559 టన్నుల ఎరువులు అవసరమని గుర్తించినట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి తెలిపారు. ఇప్పటికే 7,120 టన్నుల యూరియా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉందన్నారు. ఈ నెలాఖరులో మరో 1,704 టన్నుల యూరియా జిల్లాకు వస్తుందని వెల్లడించారు. నానో ఎరువులు కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.
News December 15, 2025
KMR: 70 ఏళ్ల వయసులో సర్పంచ్

రెండో విడత స్థానిక ఎన్నికల్లో నిజాంసాగర్ (M) నర్సింగ్ రావుపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన 70 ఏళ్ల అభ్యర్థి అంజలీదేవి సర్పంచ్గా విజయం సాధించారు. వయస్సు రాజకీయాలకు అడ్డుకాదని నిరూపిస్తూ ప్రజల మద్దతుతో గెలుపొందారు. అనుభవం, నిబద్ధతే తన విజయానికి కారణమన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పని చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.


