News May 22, 2024
వరంగల్: పచ్చిరొట్ట విత్తనాల ధరలు ఖరారు

పచ్చిరొట్ట విత్తనాల ధరలను ఖరారు చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయశాఖ అధికారులు ఈసారి ముందస్తుగా పచ్చిరొట్ట విత్తనాలు తెప్పించారు. జీలుగు విత్తనాలు 22,000 క్వింటాళ్లు, 450 క్వింటాళ్ల పిల్లిపెసర, 2,300 క్వింటాళ్ల జనుము విత్తనాలను సాగును అనుసరించి మండలాలకు కేటాయించారు. వీటిని 60 శాతం రాయితీపై రైతులకు ఇవ్వనున్నారు.
Similar News
News January 5, 2026
సూసైడ్కు యత్నం.. కాపాడిన వరంగల్ పోలీసులు

వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి రైలు పట్టాలపై దేశాయిపేట ప్రాంతానికి చెందిన మంద వినోద్ అన్న యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడగా మిల్స్ కాలనీ కానిస్టేబుళ్లు కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి, రాధిక అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నా యువకుడు పట్టాలపై పడుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా బయటకు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News January 5, 2026
వరంగల్ ప్రజావాణిలో 151 దరఖాస్తుల స్వీకరణ

వరంగల్ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 151 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 59 దరఖాస్తులు కాగా, జీడబ్ల్యూఎంసీ (GWMC)కు 20, డీఆర్డీఓ, డీపీఓ శాఖలకు చెరో 11 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. మిగతా వివిధ శాఖలకు సంబంధించిన దరఖాస్తులు 50 ఉన్నట్లు వెల్లడించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తును త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
News January 5, 2026
WGL: కొండాపురంలో రైతు హత్య?

రాయపర్తి మండలం కొండాపురంలో రైతు కొండ వీరస్వామి (60) తన వ్యవసాయ క్షేత్రం వద్ద అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. తలపై గాయాలతో పడి ఉన్న వీరస్వామి మృతదేహాన్ని గొర్రెలు కాపరులు గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.


