News June 28, 2024

వరంగల్‌: పడిపోతున్న పల్లి ధర!

image

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వేరుశనగ పంట సాగు విస్తీర్ణం ఏటికేడు తగ్గుముఖం పడుతోంది. గతేడాది సుమారు 5 వేల ఎకరాల వరకు సాగు చేసిన రైతులు ఈ ఏడాది 4,200 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. దానికి తోడు ఆకుమచ్చ, ఆకు పీల్చే పురుగులు తదితర కారణాలతో వేరుశనగ పంట దిగుబడి తగ్గిపోతోంది. గతేడాది క్వింటా రూ.8 వేల వరకు పలికిన పల్లి ఈ ఏడాది రూ.5 వేల వరకు పడిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News October 9, 2024

సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క

image

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ కులగణన అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం వర్గీకరణ అమలు, బీసీ కులగణనకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News October 9, 2024

నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క

image

హైదరాబాదులో డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News October 9, 2024

వరంగల్: రేపటి నుంచి ఎనుమాముల మార్కెట్‌కు సెలవులు

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల మార్కెట్‌కు రేపటి నుంచి నాలుగు రోజులు వరుసగా సెలవులు ప్రకటిస్తున్నామని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పి. నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. రేపు దుర్గాష్టమి, ఎల్లుండి మహార్నవమి, 12న విజయదశమి, 13న ఆదివారం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. కాబట్టి రైతులు మార్కెట్‌కు రాకూడదని పేర్కొన్నారు. ఈనెల 14న మార్కెట్ పునః ప్రారంభమవుతుందని తెలిపారు.