News December 18, 2025

వరంగల్: ప్రభుత్వ పాఠశాలల్లో జీరో చేరికలు!

image

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గుతున్నాయి. 2024-25లో దేశంలోని 5,149 స్కూల్స్‌లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. వాటిలో 70% తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాయి. TGలో 2,081 స్కూల్స్ ఖాళీగా ఉండగా, నల్లగొండలో 315, మహబూబాబాద్ 167, వరంగల్‌లోని 135 పాఠశాలల్లో జీరో ఎన్రోల్‌మెంట్ నమోదయ్యింది. ఖాళీ స్కూల్స్‌లో 1.44 లక్షల మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు. ఖాళీ పాఠశాలల్లో టీచర్ల సంఖ్య ఎక్కువగా కొనసాగుతోంది.

Similar News

News December 19, 2025

నేటి ముఖ్యాంశాలు

image

❁ AP: చంద్రబాబుకు ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
❁ ‘PPP’ తప్పనుకుంటే నన్ను జైలుకు పంపు జగన్: సత్యకుమార్
❁ వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకోవాలి: జగన్
❁ గతేడాదితో పోలిస్తే ఏపీలో నేరాలు తగ్గుముఖం: DGP
❁ TG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో 66% సీట్లు మావే: రేవంత్
❁ గ్రూప్-3 ఫలితాలు విడుదల.. 1,370 మంది అభ్యర్థులు ఎంపిక
❁ KCR అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు: KTR
❁ SMAT విజేతగా ఝార్ఖండ్

News December 19, 2025

మెస్సీ ఈవెంట్.. రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసిన గంగూలీ

image

నిర్వహణ లోపం వల్ల కోల్‌కతాలో ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ ఈవెంట్ రద్దైన సంగతి తెలిసిందే. కాగా ఈ ఈవెంట్‌కు మధ్యవర్తిగా వ్యవహరించారన్న AFCK ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహా ఆరోపణలపై సౌరభ్ గంగూలీ పరువు నష్టం దావా వేశారు. నిరాధారమైన సాహా వ్యాఖ్యలు తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని రూ.50 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తనకు ఈవెంట్‌తో ఎలాంటి సంబంధం లేదని, కేవలం గెస్ట్‌గా హాజరయ్యానని ఆయన స్పష్టం చేశారు.

News December 19, 2025

రాజమండ్రి: ‘క్లాట్’ ఫలితాల్లో శ్రీ షిర్డీసాయి ప్రభంజనం

image

రాజమండ్రి శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థలు ‘క్లాట్’ ఫలితాల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సంస్థకు చెందిన డ్యాఫ్నీ సివిల్స్ అకాడమీ విద్యార్థిని ఎస్. శ్రీ సాయి గీతిక జాతీయ స్థాయిలో 3వ, రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి సత్తా చాటారు. వివిధ కేటగిరీల్లో 100 లోపు ముగ్గురు, 500 లోపు 12 మంది ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల ఛైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు.