News February 3, 2025
వరంగల్: ప్రారంభమైన మార్కెట్.. తరలివచ్చిన పత్తి
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు ప్రారంభం కాగా పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం తాము ఊహించిన విధంగా రాలేదని రైతులు నిరాశ చెందుతున్నారు. 15 రోజుల క్రితం రూ.7,200కి పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా తగ్గింది. నేడు మార్కెట్లో క్వింటా పత్తి ధర రూ.7,000 పలికినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు.
Similar News
News February 3, 2025
వరంగల్ విద్యార్థికి ప్రపంచ రికార్డులో చోటు
వరంగల్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి అభ్యసిస్తున్న ఇమ్మడి అభిరామ్కు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. స్కూల్లో సీనియర్ విద్యార్థులకు నిర్వహించిన సాంస్కృతిక దినోత్సవంలో అభిరామ్ మహాభారతంలోని కర్ణుడి వేషాధరణలో 5 నిమిషాల 30 సెకన్ల పాటు అనర్గళంగా ఏకపాత్రాభినయం ప్రదర్శించాడు. ఈ ఏకపాత్రాభినయాన్ని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు చేసుకొని సూపర్ టాలెంట్ కిడ్ అవార్డుకు ఎంపిక చేశారు.
News February 3, 2025
ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి
ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.
News February 3, 2025
వరంగల్: ప్రజావాణిలో ఆర్జీలను స్వీకరించిన కలెక్టర్
వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజావాణిలో ప్రజలు అందజేసిన ఆర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారదాదేవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.