News October 18, 2025
వరంగల్: బంద్.. ప్రైవేటు వాహనాల డ్రైవర్ల దందా..!

బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్ కొనసాగుతోంది. ఈ మేరకు వ్యాపార, వాణిజ్య యజమానులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. బస్సులు RTC డిపోల్లోనే ఉండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. బస్టాండ్లో వేచి చూస్తున్న ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బంద్ను అదునుగా చేసుకొని WGL, HNK నుంచి HYD ఉప్పల్కు రెట్టింపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.
Similar News
News October 18, 2025
జయశంకర్ జిల్లాలో 1055 మద్యం టెండర్లకు దాఖలు

భూపాలపల్లి జిల్లాలో మద్యం శనివారం సాయంత్రం మద్యం టెండర్లు దాఖలు ముగిశాయి. జయశంకర్, ములుగు జిల్లాలకు 59 షాపులు ఉండగా.. 1055 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తు రూ.3 లక్షల చొప్పున దరఖాస్తు ఫీజులను చెల్లించారు. గతేడాది 59 మద్యం షాపులకు 2161 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే సగం దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇది ఇలా ఉంటే మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.
News October 18, 2025
ఖమ్మం కలెక్టర్ను కలిసిన స.హ.చ కమిషనర్

ఖమ్మం కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ అనుదీప్ని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.వి. శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిశారు. సమాచార హక్కు చట్టం అమలు, చట్టం నిబంధనలు 4(1)(బి), 6(1) లపై పౌర సమాచార అధికారులకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ, జిల్లాలో పెండింగ్ ఉన్న ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం మార్గం తదితర అంశాలపై కమిషనర్.. కలెక్టర్తో చర్చించారు.
News October 18, 2025
సోలార్ యూనిట్లు ప్రోత్సహించాలి: కలెక్టర్

జిల్లాలో సోలార్ యూనిట్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం మాట్లాడుతూ.. దీపావళి రోజు వాతావరణం కలుషితం చెయ్యని క్రాకర్స్ను మాత్రమే వెలిగించాలని ప్రజలకు సూచించారు. అన్ని రంగాల్లోనూ జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా అధికారులు కృషి చెయ్యాలని కోరారు.