News March 12, 2025
వరంగల్: బల్దియా పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం

కరీంనగర్లోనే లోయర్ మానేరు డాం వద్ద 33/11 కెవి సబ్ స్టేషన్ వార్షిక నిర్వహణ పనులు కొనసాగుతున్నందున నేడు ఉదయం 8గంటల నుంచి 6గంటల వరకు నీటి సరఫరా జరగదని మున్సిపల్ అధికారులు తెలిపారు. వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతం, మడికొండ, కడిపికొండ బట్టుపల్లి రాంపూర్ ఎల్లాపూర్ నేటి సరఫరా జరగదని పేర్కొన్నారు. ఇట్టి ప్రాంతవాసులు గమనించి సహకరించాలని ఎస్సీ ప్రవీణ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News July 8, 2025
రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా సూర్యనారాయణ

రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీగా వరంగల్కు చెందిన సూర్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. రేషన్ డీలర్ల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. రేషన్ డీలర్ల కష్ట సుఖాలు పాలుపంచుకుని వారి సమస్యలు తీర్చడానికి సంఘం తరఫున అన్ని విధాలా ముందు ఉంటానని హామీ ఇచ్చారు. పోస్ట్ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
News July 7, 2025
వరంగల్ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

వరంగల్ జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. సంగెం 6.8, నెక్కొండ 12.8, నల్లబెల్లి 34.0, వరంగల్ 10.3, గీసుకొండ 6.3, పర్వతగిరి 6.3, వర్ధన్నపేట 11.3, ఖానాపూర్ 18.3, చెన్నారావుపేట 10.0, దుగ్గొండి 41.8, రాయపర్తి 4.0, నర్సంపేట 18.0, మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు.
News July 7, 2025
వరంగల్: క్వింటా పసుపు రూ.12,659

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటాకి రూ.2,400 పలకగా.. పసుపు రూ. 12,659 ధర పలికింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.6050 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,850 ధర వచ్చిందని అధికారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.