News March 15, 2025

వరంగల్: బ్యాంక్ సిబ్బంది వేధింపులు.. సోదరుల ఆత్మహత్యాయత్నం

image

వరంగల్ పట్టణ పరిధిలో దారుణం జరిగింది. ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది వేధింపులు తట్టుకోలేక పట్టణంలోని చిలుకూరి క్లాత్ స్టోర్ సోదరులు ఇద్దరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 25, 2025

సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా షంషుద్దీన్

image

ముస్లిం సమైక్య వేదిక సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా గోరంట్లలోని మల్లాపల్లి గ్రామానికి చెందిన షంషుద్దీన్ ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈ అవకాశం కల్పించిన ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ అన్వర్, అలాగే మహిళా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మక్బూల్తాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింల సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు.

News December 25, 2025

అనంత జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి ఈయనే.!

image

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బొమ్మనహల్ దర్గా హోన్నూరు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు హెచ్.ఆనంద్‌ను జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నియమించారు. తాను పార్టీకి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని తెలిపారు. ఈ పదవిని ఇచ్చిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు.

News December 25, 2025

1.07 లక్షల మందికి స్కాలర్‌షిప్

image

AP: రాష్ట్రంలోని కేజీబీవీల్లో చదువుకుంటున్న బాలికల స్కాలర్‌షిప్‌ల కోసం సమగ్రశిక్ష రూ.10.70 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను రూ.1,000 చొప్పున విద్యార్థినుల పేరెంట్స్ ఖాతాల్లో జమ చేసింది. కేజీబీవీల్లో 1.07 లక్షల మంది బాలికలు చదువుకుంటున్నారు. నిధుల విడుదలతో వారందరికీ ఊరట కలగనుంది.