News September 20, 2025

వరంగల్: మంత్రి.. ఎమ్మెల్యే.. ఓ రావణుడు..!

image

జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఇటీవల ప్రజాపాలన దినోత్సవంలో మంత్రుల స్థానాలను మార్చి జెండాలను ఎగరవేశారు. ప్రస్తుతం దసరా సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గంలోని 14వ డివిజన్‌లో నిర్వహించే రావణవధ కార్యక్రమం కొత్తచిక్కులు తెచ్చింది. నిర్వహించేది మంత్రి సురేఖ అనుచరులైతే, స్థలం మాత్రం ఎమ్మెల్యే నాగరాజు పరిధిలో ఉంది. దీంతో ప్రాధాన్యతపై చిక్కులు ఏర్పడ్డాయి.

Similar News

News September 20, 2025

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. భక్తుల విన్నపాలు ఇవే

image

➣దూర ప్రాంతాల భక్తులకు బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలి. లాకర్ సౌకర్యం కల్పించాలి.
➣ప్రసాదాల వద్ద సరిపడా చిల్లర తెచ్చుకోవాలనడంతో ఇబ్బంది. డిజిటల్ పేమెంట్లకు అవకాశం కల్పించాలి.
➣కేశఖండన శాలల వద్ద డబ్బులు వసూళ్లపై నియంత్రణ.
➣వాష్ రూమ్స్ సరైన మెయింటెన్స్ లేకపోవడం
➣క్యూలైన్లో మజ్జిగ, బిస్కెట్స్ లాంటివి అందించడం
➣మాలలు అమ్మవారి గుడిలోనే తీసేలా చర్యలు

News September 20, 2025

ట్రంప్ నిర్ణయంతో భారతీయుల ఉద్యోగాలు పోతాయ్: కాంగ్రెస్

image

US H-1B వీసా ఫీజులు పెంచడంతో భారత్ చాలా నష్టపోతుందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘మోదీ ఫ్రెండ్ ట్రంప్ ₹6లక్షలుగా ఉన్న H-1B వీసా ఫీజును ₹88లక్షలకు పెంచారు. దీని వల్ల ఇండియన్స్‌కు USలో ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. అక్కడి నుంచి INDకు వచ్చే మనీ తగ్గుతుంది. ఇక్కడి IT ఉద్యోగుల జాబ్స్ రిస్క్‌లో పడతాయి. మోదీ ఫెయిల్డ్ ఫారిన్ పాలసీ పరిణామాలను దేశం ఇప్పుడు అనుభవిస్తున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది’ అని పేర్కొంది.

News September 20, 2025

మనిషికి మద్యంతో సంబంధం ఇప్పటిది కాదు!

image

మనిషికి ఆల్కహాల్‌తో లక్షల ఏళ్ల క్రితమే సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవి చింపాంజీలు రోజూ ఒక బాటిల్ బీరు మోతాదులో పులిసిన పండ్లను తినేవని వారు గుర్తించారు. ఈక్రమంలో పూర్వీకుల నుంచే మనిషికి మద్యంపై ఆసక్తి ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పరిశోధన ప్రకారం, పండ్లలోని చక్కెర, ఆల్కహాల్ రెండూ ఆ చింపాంజీలకు ఆహార వనరులుగా ఉపయోగపడ్డాయి.