News December 10, 2025
వరంగల్: మక్కలు క్వింటాకి రూ.2,105

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి బుధవారం మొక్కజొన్న తరలివచ్చింది. ఈ క్రమంలో గత వారంతో పోలిస్తే నేడు మొక్కజొన్న ధర పెరిగింది. గతవారంలో మక్కలు(బిల్టీ) క్వింటాకు గరిష్ఠంగా రూ.2,020 ధర రాగా.. నేడు రూ.2,105 అయింది. దీంతో మొక్కజొన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, క్వింటా పచ్చి పల్లికాయకు రూ.5,300 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News December 13, 2025
19 అమావాస్యలు ఇలా చేస్తే…?

కూష్మాండ దీపాన్ని అమావాస్య/అష్టమి రోజు వెలిగించాలి. మొత్తం 19 అమావాస్యలు/19 అష్టములు ఈ దీపం వెలిగించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పూజానంతరం ఎండు ఖర్జూరాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే గ్రహ వాస్తు పీడల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. జనాకర్షణ, ధనయోగం కోసం ఈ పరిహారాన్ని పాటిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరాలని కాల భైరవుడిని స్మరిస్తూ సంకల్పం చెప్పుకొని ఈ కూష్మాండ దీపాన్ని వెలిగిస్తారు.
News December 13, 2025
వరంగల్: ‘మా ఓట్లు అమ్మట్లేదు’ ఇంటి గోడపై పోస్టర్!

‘మా ఓట్లు అమ్మడం లేదు’ అంటూ ఇంటి గోడపై ఓటర్లు ఓ పోస్టర్ అతికించిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో జరిగింది. నల్లబెల్లి మండలంలో రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమ ఓటు ఎవ్వరికీ అమ్మబోమని స్పష్టం చేస్తూ గ్రామ ఆదర్శ రైతు రాధాకృష్ణ పోస్టర్ అతికించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అయ్యింది.
News December 13, 2025
102 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<


