News July 19, 2024

వరంగల్: మక్కల ధరలకు బ్రేక్!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కొద్ది రోజులుగా రికార్డులు సృష్టిస్తున్న మొక్కజొన్న ధరలకు ఈరోజు బ్రేక్ పడింది. వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన మక్కల ధర ఈరోజు తగ్గింది. గురువారం రూ.2,780 పలికిన ధర.. ఈరోజు రూ.2,750 కి చేరింది. నిన్నటికి, నేటికీ స్వల్ప తేడా ఉన్నప్పటికీ ధరలు భారీగా పలుకుతుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News August 26, 2025

ఖానాపూర్: నిస్సహాయ స్థితిలో వ్యక్తి మృతి!

image

కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫిట్స్ రావడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మండలంలోని బండమీది మామిడి తండాకు చెందిన బానోతు శ్రీను(42)కు భార్య, పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీనుకు మధ్యాహ్నం సమయంలో ఫిట్స్ రావడంతో మృతి చెందాడు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన పిల్లలు ఎంత పిలిచినా తండ్రి లేవకపోవడంతో, ఇంటి పక్క వారికి సమాచారం ఇచ్చారు.

News August 25, 2025

వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

image

వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు (బిల్టీ) రూ.2,365, సూక పల్లికాయ రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.3,500 పలికాయి. అలాగే 5531 రకం మిర్చికి రూ.13 వేలు, ఇండిక మిర్చి రూ.13,800, డీడీ మిర్చి రూ.14 వేలు, నం.5 రకం మిర్చికి రూ.13,300 ధర లభించిందని వ్యాపారులు తెలిపారు.

News August 25, 2025

వరంగల్: అస్తవ్యస్తంగా వీధి దీపాల నిర్వహణ..!

image

పలు గ్రామాల్లో వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణకు గాను గత ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు ఏడేళ్ల పాటు బాధ్యతలను అప్పగించింది. స్తంభాలకు విద్యుత్ దీపాలను బిగించిన సంస్థ అనంతరం నిర్వహణను గాలికి వదిలేయడంతో గ్రామాలు అంధకారంలో మునిగాయి. దీనిపై విమర్శలు రావడంతో జీపీల ద్వారా బల్బులు ఏర్పాటు చేశారు. సర్పంచులు లేకపోవడంతో కార్యదర్శులపై భారం పడుతోంది.