News February 21, 2025

వరంగల్: మళ్లీ పెరిగిన మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి శుక్రవారం మొక్కజొన్న తరలివచ్చింది. అయితే ధర ఈ వారం మొదటి రోజుతో పోలిస్తే భారీగా పెరిగింది. మంగళవారం మక్కలు(బిల్టీ)కి రూ.2,311 ధర రాగా నేడు రూ.2,370కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే సూక పల్లికాయకి రూ.6,600, పచ్చి పల్లికాయకి రూ.5,500 ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

Similar News

News December 16, 2025

ముస్తాబాద్: 730 మందితో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు 730 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీస్ స్టేషన్లలో ఎన్నికల విధులపై పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆఖరి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

News December 16, 2025

మోదీకి గాంధీ ఆశయాలు నచ్చవు: రాహుల్ గాంధీ

image

గాంధీజీ ఆశయాలు, పేదల హక్కులు ప్రధాని మోదీకి నచ్చవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో గ్రామీణ పేదల జీవనోపాధిని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల నుంచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. MGNREGAపై కొత్త బిల్లు ప్రవేశపెట్టడం గాంధీని అవమానించడమేనన్నారు. నిరుద్యోగంతో ఇప్పటికే యువత భవిష్యత్తును మోదీ నాశనం చేశారని చెప్పారు.

News December 16, 2025

HILTP లీక్ వెనుక ఓ మంత్రి, సీనియర్ IAS!

image

TG: <<18457165>>HILTP<<>> లీక్ కేసులో విజిలెన్స్ విచారణ ముగిసింది. CM రేవంత్‌కు విచారణ నివేదికను అధికారులు అందించారు. ఓ మంత్రి, సీనియర్ IAS అధికారి పాలసీ వివరాలు లీక్ చేశారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ తరువాత BRS నేతలకు వాటిని చేరవేశారని తేల్చారు. మంత్రి సూచనతో అలా చేశానని అధికారి చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా అధికారి కావాలనే మంత్రిని ఇరికిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.