News June 19, 2024
వరంగల్ మార్కెట్కు ఇకపై బుధవారం సెలవు రద్దు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఇకనుంచి ప్రతి బుధవారం ఓపెన్ ఉండనుంది. ఎండాకాలంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మూడు నెలల క్రితం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల విజ్ఞప్తి మేరకు ప్రతి బుధవారం మార్కెట్కు సెలవు ప్రకటించారు. ఇక ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆ సెలవులు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విషయాన్ని రైతులు గమనించి బుధవారం సైతం మార్కెట్కు సరుకులు తీసుకొని రావచ్చన్నారు.
Similar News
News December 18, 2025
వరంగల్ జిల్లాలో సింగిల్ డిజిట్లో గెలిచిన అభ్యర్థులు!

నర్సంపేట మండలం జీజీఆర్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి భూస నరసయ్య ఒక్క ఓటు తేడాతో గెలిచారు. 453 ఓట్లకు గాను 421 పోలై నరసయ్యకు 191, BRS అభ్యర్థి కుమారస్వామికి 190 ఓట్లు వచ్చాయి. ఖానాపురం మండలం అయోధ్యనగర్లో BRS అభ్యర్థి కూస విమల నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నెక్కొండ మండలం మడిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆంగోత్ అనూష, అజ్మీరా మంగ్యానాయక్ తండాలో BRSఅభ్యర్థి మాలోత్ వెంకట్ స్వల్ప మెజార్టీతో గెలిచారు.
News December 17, 2025
గొల్లభామ తండా సర్పంచ్గా బాలు నాయక్

చెన్నారావుపేట మండలంలోని గొల్లభామ తండా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన గుగులోతు బాలు నాయక్ విజయం సాధించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
News December 17, 2025
వరంగల్: 77.58 శాతం పోలింగ్ @1PM

వరంగల్ జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా వ్యాప్తంగా 77.58శాతం పోలింగ్ అయింది. చెన్నారావుపేట మండలంలో 84 శాతం, ఖానాపూర్లో 70.35, నర్సంపేటలో 82.16, నెక్కొండలో 75.4 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.


