News January 27, 2025

వరంగల్ మార్కెట్‌లో అరుదైన మిర్చి

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు వివిధ రకాల అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలివచ్చాయి. 1048 రకం మిర్చి రూ.12వేలు పలకగా.. డబ్బి బ్యాగడి మిర్చి రూ.13వేలు పలికింది. అలాగే నం.5 మిర్చి ధర రూ.13,000, పాత తేజా మిర్చి ధర రూ.12,000, పాత వండర్ హాట్ మిర్చి రూ.12వేలు, 5531 మిర్చి రూ.12వేలు, 2043 మిర్చి రూ.14వేలు ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News September 14, 2025

యానిమల్ లవర్స్‌పై ప్రధాని మోదీ సెటైర్లు

image

ఢిల్లీలో ఇటీవల వీధి కుక్కల తరలింపును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యానిమల్ లవర్స్ ఉద్యమించిన విషయం తెలిసిందే. వారి డబుల్ స్టాండర్డ్స్‌పై ప్రధాని మోదీ రీసెంట్‌గా ఓ ఈవెంట్లో సెటైర్లు వేశారు. ‘నేను ఇటీవల కొంతమంది యానిమల్ లవర్స్‌ను కలిశాను. మన దేశంలో అలాంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వారిలో ఎక్కువ మంది ఆవులను యానిమల్‌గా పరిగణించరు’ అని వ్యాఖ్యానించారు.

News September 14, 2025

కౌరవుడే అయినా.. అన్యాయాన్ని ఎదురించాడు!

image

మహాభారతంలో ఎందరికో తెలియని పాత్రలెన్నో ఉన్నాయి. అందులో వికర్ణుడి పాత్ర ఒకటి. ఆయన కౌరవుడే అయినప్పటికీ ద్రౌపది వస్త్రాపహరణం వంటి అధర్మ కార్యాలను వ్యతిరేకించాడు. ధ్రుతరాష్ట్రుడు, ద్రోణుడు, కృపాచార్యుడు వంటి పెద్దలు నిలబడి చోద్యం చూసినా వికర్ణుడు ఊరుకోలేదు. కౌరవ అగ్రజుడైన ధుర్యోదనుడినే ఎదురించాడు. కానీ, రక్త సంబంధానికి కట్టుబడి కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన పోరాడాడు. భీముడితో తలపడి వీరమరణం పొందాడు.

News September 14, 2025

కొత్తగూడ: చంటి బిడ్డతో ఓ తల్లి నిరసన

image

కొత్తగూడ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వెజ్, కాంటిజెంట్ కార్మికులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెలో ఒక మహిళ తన చంటి బిడ్డతో వర్షంలో గొడుగు పట్టుకుని నిరసన తెలుపుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి నిరసనలు కొనసాగుతున్నాయి.