News February 14, 2025

వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే 5,531 మిర్చి రూ.11 వేలు, దీపిక మిర్చి రూ.17,500, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 1048 రకం మిర్చి రూ.11 వేలు, మక్కలు (బిల్టీ) రూ. 2,355, సూక పల్లికాయ రూ.6,500, పచ్చి పల్లికాయకి రూ.4,500 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News December 14, 2025

రాంనగర్‌లో విషాదం: నాడు తండ్రి.. నేడు కుమారుడు!

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్‌లో విషాదం అలుముకుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వస్తూ వరుస సోదరులు బుర్ర కళ్యాణ్ (27), బుర్ర నవీన్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పదేళ్ల క్రితం తండ్రి ఉప్పలయ్య ప్రమాదంలో మరణించగా అప్పట్లో ప్రాణాలతో బయటపడ్డ నవీన్ ఇప్పుడు మృత్యువాత పడటంతో గ్రామం శోకసంద్రంగా మారింది. పెళ్లి ఏర్పాట్ల వేళ ఈ దుర్ఘటన కుటుంబాన్ని కంటతడి పెట్టించింది.

News December 14, 2025

HNK, వరంగల్ జిల్లాల్లో రసవత్తరంగా పంచాయతీ ఎన్నికలు

image

రెండో విడత పంచాయతీ ఎన్నికలు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రసవత్తరంగా సాగనున్నాయి. పార్టీ గుర్తులు లేకున్నా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు బరిలో ఉన్నారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. నేడు పోలింగ్ అనంతరం వచ్చే ఫలితాలు గ్రామీణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనున్నాయి.

News December 14, 2025

వరంగల్: ఆకట్టుకుంటున్న గ్రీన్ పోలింగ్ కేంద్రాలు

image

వరంగల్ కలెక్టర్ సత్య శారద చొరవతో గీసుకొండ, నల్లబెల్లి మండలాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రీన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పర్యావరణహితంగా తీర్చిదిద్దిన ఈ కేంద్రాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్లాస్టిక్ రహిత అలంకరణ, మొక్కలు, పూలతో కేంద్రాలను ఆకర్షణీయంగా రూపొందించడంతో పాటు ఓటర్లకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించారు.