News August 25, 2025

వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు ఇలా..!

image

వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు (బిల్టీ) రూ.2,365, సూక పల్లికాయ రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.3,500 పలికాయి. అలాగే 5531 రకం మిర్చికి రూ.13 వేలు, ఇండిక మిర్చి రూ.13,800, డీడీ మిర్చి రూ.14 వేలు, నం.5 రకం మిర్చికి రూ.13,300 ధర లభించిందని వ్యాపారులు తెలిపారు.

Similar News

News August 25, 2025

వరంగల్: అస్తవ్యస్తంగా వీధి దీపాల నిర్వహణ..!

image

పలు గ్రామాల్లో వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణకు గాను గత ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు ఏడేళ్ల పాటు బాధ్యతలను అప్పగించింది. స్తంభాలకు విద్యుత్ దీపాలను బిగించిన సంస్థ అనంతరం నిర్వహణను గాలికి వదిలేయడంతో గ్రామాలు అంధకారంలో మునిగాయి. దీనిపై విమర్శలు రావడంతో జీపీల ద్వారా బల్బులు ఏర్పాటు చేశారు. సర్పంచులు లేకపోవడంతో కార్యదర్శులపై భారం పడుతోంది.

News August 24, 2025

నర్సంపేట: జైలర్ లక్ష్మీ శృతి సస్పెండ్

image

నర్సంపేటలోని జిల్లా మహిళా స్పెషల్ కారాగారం జైలర్ కే.ఎన్.ఎస్. లక్ష్మీ శృతిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నర్సంపేట మహిళా జైలులో ఈనెల 21న రిమాండ్ ఖైదీ సుచరిత మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. జైలర్ నిర్లక్ష్యంతో రిమాండ్ ఖైదీ మృతి చెందారని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News August 24, 2025

వినాయక చవితి ఏర్పాట్లు పూర్తి: వరంగల్ కలెక్టర్

image

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎటువంటి అంతరాయం లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని కలెక్టర్ సత్య శారద చెప్పారు. నిమజ్జనోత్సవ సమయంలో చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ పండుగ నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు రాకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.