News October 7, 2024
వరంగల్ మార్కెట్లో కొత్త పత్తి ధర రూ.7,100
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు నేడు కొత్త పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. గతవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,950 పలకగా నేడు రూ.7,100కి చేరినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు. దసరాకు కొద్ది రోజులు ముందుగా కొత్తపత్తి వస్తుందని, దీపావళి ముగిసే వరకు ఈ పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయని వ్యాపారులు పేర్కొన్నారు.
Similar News
News October 7, 2024
ఆత్మీయులను కోల్పోవడానికి మించిన దుఃఖం లేదు: సీతక్క
ఆత్మీయులను కోల్పోవడానికి మించిన దుఃఖం లేదని మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకులు నూకల నరేశ్ రెడ్డి, చుక్కల ఉదయ చందర్ కుటుంబాలను నేడు పరామర్శించానని, వారి కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో అన్ని విధాల అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
News October 7, 2024
వరంగల్ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర
2 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభమైంది. గత వారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. గత వారంలో క్వింటా పత్తి రూ.7,450 పలకగా నేడు రూ.7550 అయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆశించిన స్థాయిలో ధర రాకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.
News October 7, 2024
వరంగల్: గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ సందడి!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్ జిల్లాలో 325, హనుమకొండ- 208, మహబూబాబాద్-461, జనగామ-283, ములుగు -174, భూపాలపల్లి – 240 గ్రామ పంచాయతీలున్నాయి.