News February 4, 2025

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారంతో పోలీస్తే ఈరోజు వివిధ రకాల మిర్చి ధరలు తగ్గాయి. సోమవారం క్వింటా తేజ మిర్చి ధర రూ. 13,900 పలకగా నేడు రూ.13,500 పలికింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14,500 పలకగా ఈరోజు రూ.14,200కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ (WH) మిర్చికి నిన్న రూ.14,800 ధర రాగా.. నేడు రూ.15వేలకు చేరింది.

Similar News

News September 16, 2025

ప్రజలకు విశాఖ సిటీ పోలీసుల హెచ్చరిక

image

విశాఖపట్నం సిటీ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. లోన్ యాప్స్ వలలో పడి అనేక మంది వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. డౌన్లోడ్ చేసిన వెంటనే వ్యక్తిగత సమాచారం దోచుకుని, ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తెలిపారు. సైబర్ మోసాలకు గురవకుండా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.

News September 16, 2025

GST ఎఫెక్ట్.. ధరలు తగ్గించిన మదర్ డెయిరీ

image

GST శ్లాబులను సవరించిన నేపథ్యంలో పాలు, పాల ఉత్పత్తుల ధరలను తగ్గించినట్లు మదర్ డెయిరీ ప్రకటించింది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. లీటర్ పాల ధర ప్రస్తుతం రూ.77 ఉండగా రూ.75కు తగ్గించామని తెలిపింది. నెయ్యి, వెన్న, ఐస్‌క్రీమ్స్ రేట్లనూ తగ్గించినట్లు వెల్లడించింది. పాలపై సున్నా, మిగతా ఉత్పత్తుల(పనీర్, బట్టర్, చీజ్, మిల్క్ షేక్స్, ఐస్‌క్రీమ్స్)పై 5% జీఎస్టీ ఉంటుందని తెలిపింది.

News September 16, 2025

GDK: ‘సెలవులకు ఊర్లకు వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి’

image

దసరా సెలవులకు ఊర్లకు వెళ్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పెద్దపల్లి DCP P.కరుణాకర్‌ సూచించారు. మంగళవారం గోదావరిఖని వన్‌టౌన్‌లో విలేకరులతో మాట్లాడారు. పోలీసు వారికి సమాచారం ఇస్తే పెట్రోలింగ్‌ చేయడం జరుగుతుందన్నారు. ఊర్లకు వెళ్తే విలువైన వస్తువులను ఇండ్లలో వదిలి వెళ్లవద్దని, బ్యాంక్‌ లాకర్‌లో భద్ర పరుచుకోవాలని సూచించారు. ఇంటిని గమనిస్తూ ఉండాలని చుట్టూ పక్కల వారికి తెలిపి వెళ్లాలని సూచించారు.