News April 25, 2024
వరంగల్ మార్కెట్లో తగ్గిన పత్తి ధర

నిన్న ప్రత్యేక సెలవు (ఎండాకాలం నేపథ్యంలో ప్రతీ బుధవారం సెలవు) అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభం అయింది. అయితే మొన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర తగ్గింది. మొన్న రూ.7,100 పలికిన క్వింటా పత్తి.. ఈరోజు రూ.7020 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
Similar News
News September 10, 2025
WGL: గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తుల స్వీకరణ

వరంగల్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు జిల్లా అధికారి అపర్ణ తెలిపారు. ఈనెల 12న ఉదయం 9 గంటలకు రాయపర్తి గురుకుల పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు తమ హాల్ టికెట్, ఒరిజినల్ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మెరిట్ జాబితా ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేస్తారని పేర్కొన్నారు.
News September 10, 2025
ఫేక్ మెసేజ్లపై వరంగల్ పోలీసుల హెచ్చరిక

‘కేంద్ర ప్రభుత్వ పథకాలకు మీరు అర్హులు. లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి’ అంటూ వాట్సాప్ సహా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సందేశాలను నమ్మొద్దని వరంగల్ పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు లింకులు మోసాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, ప్రజలు ప్రభుత్వ పథకాల కోసం కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే వినియోగించాలి అని సూచించారు. ఫేస్బుక్లో అధికారిక పేజీ ద్వారా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
News September 9, 2025
వరంగల్: 136 ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా ప్రజల నుంచి 136 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ సమస్యలు 60, జీడబ్ల్యూఎంసీ 21, విద్యాశాఖ 11, సహకార శాఖ 9, గృహ నిర్మాణ శాఖ 7, ఇతర శాఖలకు 28 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.