News February 6, 2025
వరంగల్: మార్కెట్లో ధరల వివరాలు..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ రకాల మిర్చి ఉత్పత్తులు రాగా.. ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి రూ.10,500 పలకగా.. అకిరా బ్యాగడి మిర్చి రూ.11వేలు, ఎల్లో మిర్చి రూ.18 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే 2043 రకం మిర్చి రూ.14 వేలు, 334 మిర్చి రూ.13వేలు ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News April 14, 2026
బల్కంపేట ఎల్లమ్మకు మంగళవారం ప్రత్యేక పూజలు

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే అర్చకులు, వేదపండితులు అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ రకాల పూలతో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవడంతో ఆలయం ఎల్లమ్మ తల్లి నామస్మరణతో మార్మోగింది.
News April 14, 2026
కోనసీమ: గడువు ముగిసిన తర్వాత సర్పంచ్గా విజయం

గాడిలంక పంచాయతీ ఎన్నికల కౌంటింగ్లో జరిగిన అక్రమాలు కోర్టు తీర్పుతో తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2021 ఫిబ్రవరి 21న జరిగిన ఎన్నికల్లో పెడిరెడ్డి నాగమునింద్రరావు 10 ఓట్లతో పెద్దిరెడ్డి వెంకట కృష్ణారావుపై విజయం సాధించినట్లు అధికారులు డిక్లరేషన్ ఇచ్చారు. కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని కృష్ణారావు కోర్టును ఆశ్రయించారు. విచారణలో కృష్ణారావు 14 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచినట్లు కోర్టు తీర్పు ఇచ్చింది.
News April 14, 2026
అంబేడ్కర్కు నివాళులర్పించిన నెల్లూరు కలెక్టర్

అంబేడ్కర్ జయంతి సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశానికి భారత రాజ్యాంగాన్ని ఒక దిక్సూచిగా రచించిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన దేశానికి అందించిన రాజ్యాంగం నేటికీ కొనసాగించడం అభినందనీయమన్నారు.


