News September 11, 2024
వరంగల్ మార్కెట్లో పెరిగిన అన్ని రకాల ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పల్లికాయ ధరలు మొన్నటితో పోలిస్తే ఈరోజు భారీగా పెరిగాయి.
> సోమవారం సూక పల్లికాయ ధర రూ.5,270 పలకగా నేడు రూ.6400 పలికింది.
> అలాగే పచ్చి పల్లికాయకు మొన్న రూ.3,600 ధర రాగా.. రూ.5550 పలికింది.
> మరోవైపు పసుపుకి మొన్న రూ.12,399 ధర రాగా.. నేడు రూ.12,817 ధర వచ్చింది.
> 5531 రకం మిర్చికి మొన్న రూ.12వేల ధర రాగా.. నేడు రూ.13,500 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News February 26, 2026
ఏనుమాముల మార్కెట్లో ఉద్యోగుల బదిలీ

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఏళ్ల తరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులను
అధికారులు అంతర్గత బదిలీలు చేశారు. వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ సూపర్వైజర్ను ఎనుమాముల మార్కెట్ లోని పల్లి, పత్తి యార్డుకు బదిలీ చేశారు. అలాగే అపరాలు, ధాన్యం, మిర్చి తదితర యార్డుల సూపర్వైజర్లకు అంతర్గత బదిలీలు చేశారు. ఈ అంతర్గత బదిలీలు మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.
News February 26, 2026
సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం: కలెక్టర్

కాకతీయ కెనాల్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. గురువారం జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పురోగతిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కెనాల్ పనులకు ఆటంకం కలగకుండా భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సాగునీటి సౌకర్యం మెరుగుపడితేనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.
News February 26, 2026
వరంగల్: వాకింగ్కు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో చోరీ

వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎస్కె సేవాసమాజ్ ప్రాంతంలో బుధవారం దొంగతనం జరిగింది. బాధితురాలు దాస విజయ వాకింగ్కు వెళ్లి వచ్చేలోపు గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారు పుస్తెలతాడు, సెల్ఫోన్, రూ.2,500 నగదు ఎత్తుకెళ్లాడు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.99,500 ఉంటుందని సీఐ కరుణాకర్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


