News July 3, 2024
వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటా పసుపు రూ.13,559 (నిన్న రూ.13,859) ధర పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.6000 అయింది. పచ్చి పల్లికాయకు రూ.4,300 ధర వచ్చింది. మరోవైపు మక్కలు రూ.2,535 పలకగా.. 5531 రకం మిర్చికి రూ.14,000 ధర వచ్చింది. పసుపు, పల్లికాయ ధరలు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి.
Similar News
News September 15, 2025
ప్రారంభమైన మార్కెట్.. పత్తి ధర ఏంతంటే?

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గతవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. గత వారం గరిష్ఠంగా క్వింటా రూ.7,555 ధర పలకగా.. నేడు(సోమవారం) రూ.7,400కి తగ్గింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
News September 14, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

వరంగల్ జిల్లాలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. విత్ స్కిన్ ధర కిలోకి రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతున్నది. అలాగే స్కిన్లెస్ కేజీకి రూ.250- 260 ధర, లైవ్ కోడి రూ.140- 150 ధర ఉన్నది. సిటీ తో పోలిస్తే పల్లెల్లో వీటి ద్వారా రూ.10-20 తేడా ఉంది. కాగా గతవారంతో పోలిస్తే నేడు ధరలు స్వల్పంగా పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.
News September 13, 2025
వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

వరంగల్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, మొత్తం జిల్లా వ్యాప్తంగా 18.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. వీటిలో ఎక్కువ వర్షం నెక్కొండ మండలంలో 14.9 మి.మీగా నమోదు కాగా, పర్వతగిరిలో 2.7 మి.మీ, రాయపర్తిలో 0.5 మి.మీ వర్షం కురిసింది.