News April 7, 2025
వరంగల్: రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం లభ్యం

వరంగల్ శాయంపేట రైల్వే గేట్ సమీపంలో రైలు నుంచి జారి పడి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైనట్లు వరంగల్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజు తెలిపారు. హంటర్ రోడ్డులోని శాయంపేట గేట్ సమీపాన గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారి పడి మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తుపడితే 9441557232, 8712658585 నంబర్లకు కాల్ చేయాలన్నారు.
Similar News
News September 19, 2025
పెద్దపల్లి: మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాలి: DMHO

మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి వాణిశ్రీ అన్నారు. గురువారం పట్టణ మాతా శిశు కేంద్రంలో ‘స్వస్థ నారి స్వశక్తి పరివార్’ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం 35 ఏళ్ల పైబడిన మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అన్ని పరీక్షలు, వైద్య సేవలు అందిస్తున్నదని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News September 19, 2025
ఆసిఫాబాద్లో మహిళ అదృశ్యం.. కేసు నమోదు

ఆసిఫాబాద్ మండలం సామెల తుంపల్లికు చెందిన ఆత్రం వర్ష అనే మహిళ అదృశ్యమైనట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఈరోజు తెలిపారు. ఈనెల 16న తన పుట్టింటి నుంచి వచ్చిన ఆమె తుంపల్లి ఆటో స్టాండ్ వద్ద ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వర్ష భర్త భగవంత్ రావు గురువారం ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
News September 19, 2025
VZM: స్పీకర్తో మహిళ ప్రజా ప్రతినిధుల భేటీ

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడును ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎస్.కోట ఎమ్మెల్యే లలిత కుమారి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సమావేశాల ప్రాధాన్యం, ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాలపై వారు చర్చించారు. సభా కార్యక్రమాలు విజయవంతంగా సాగేలా సహకారం అందిస్తామని తెలిపారు.