News December 16, 2025
వరంగల్: లోకల్ పోరులో లోకల్ పొత్తులు!

3వ దశ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల కాంగ్రెస్, BJP బలపరచిన వాళ్లు ఒక్కటయ్యారు. శాయంపేట మండలంలో కాంగ్రెస్కు BRS అభ్యర్థి మద్దతు పలికారు. శాయంపేట పంచాయతీ బరిలో ఉన్న BRS అభ్యర్థి రమాదేవి బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి హై డ్రామాకు తెర తీశారు. ఇక్కడ కాంగ్రెస్, కాంగ్రెస్ రెబెల్ మధ్య పోటీ జరుగుతోంది. గీసుకొండ(M) కొమ్మాలలో BRS అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది.
Similar News
News December 16, 2025
ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ

పైరసీ వ్యవహారంలో అరెస్టైన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని నాంపల్లి జిల్లా కోర్టు మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించింది. 3 కేసుల్లో విచారణ కోసం 12 రోజులకు అనుమతించింది. ఒక్కో కేసులో 4 రోజుల చొప్పున ప్రశ్నించాలని పోలీసులకు సూచించింది. దీంతో ఎల్లుండి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రవిని విచారించనున్నారు. ప్రస్తుతం రవి చంచల్గూడ జైలులో ఉన్నాడు.
News December 16, 2025
వనపర్తి: 81 గ్రామపంచాయతీలకు మూడో విడత ఎన్నికలు

వనపర్తి జిల్లా పరిధిలోని 87 గ్రామపంచాయతీలలో 6 ఏకగ్రీవమయ్యాయి.81 గ్రామపంచాయతీలో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించామని ఆమె పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి రక్షణ 163 BNSS అమలులో ఉంటుందని, ప్రశాంత ఎన్నికల కోసం పోలీసులు తమ విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.
News December 16, 2025
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఖమ్మం సీపీ

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి మండలంలోని పలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం సందర్శించారు. ముందుగా కారేపల్లిలో గల పోలింగ్ కేంద్రంలో బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రతిఒక్కరు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


