News February 27, 2025

వరంగల్: విద్యార్థిని ఆత్మహత్య.. UPDATE

image

WGL నగరంలో ఉరేసుకొని బుధవారం <<15587387>>విద్యార్థిని ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన రేష్మిత WGL ములుగు రోడ్డులోని వ్యవసాయ విద్యాలయంలో ఫస్టియర్ చదువుతోంది. విద్యార్థినికి ఇంటిపై బెంగ ఉండటంతో అప్పుడప్పుడు తల్లి ఆమెతో పాటు హాస్టల్‌లో ఉండేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. కాగా, నిన్న శివరాత్రి కావడంతో తోటి విద్యార్థులు సొంతూరు వెల్లగా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Similar News

News December 18, 2025

విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు: కలెక్టర్

image

విశాఖలో కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పర్యావరణ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని, కాలుష్య కారకాలను గుర్తించి వాటి తీవ్రత తగ్గించేలా ప్రణాళికాబద్ధ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులకు అటవీ శాఖ అనుమతుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

News December 18, 2025

కరీంనగర్: కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్న సర్పంచులు

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 37మంది నూతన సర్పంచ్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. MLAల క్యాంపు కార్యాలయాలు కొత్త సర్పంచులతో బిజీగా మారాయి. అభివృద్ధి, సంక్షేమం పేరిట మంతనాలు జరిపి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నట్లు సమాచారం. సర్పంచ్‌గా పదవి బాధ్యతలు చేపట్టేలోపే కాంగ్రెస్లో చేరాలని MLAలు డెడ్ లైన్ విధిస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న 4రోజుల్లో చేరికలు మరింత ఊపందుకోనున్నాయి.

News December 18, 2025

సిరిసిల్లలో KTR మార్క్ .. కారు హవా

image

సిరిసిల్లలో కారు జోరు ముందు అధికార కాంగ్రెస్ పార్టీ నిలవలేకపోయింది. 3వ విడతలో 7 ఏకగ్రీవాలు కలుపుకొని 87 స్థానాలకు గాను BRS మద్దతుదారులు 43 GPల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ కేవలం 15 స్థానాలతో సరిపెట్టుకుంది. BJP10, ఇతరులు 19 స్థానాలు కైవసం చేసుకున్నారు. సిరిసిల్లపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టినా KTR రాజకీయ చతురత ముందు నిలవలేకపోయింది. ఈ ఫలితాలతో సిరిసిల్లలో BRS ఆధిపత్యం స్పష్టంగా కనబడుతుంది.