News February 27, 2025

వరంగల్: విద్యార్థిని ఆత్మహత్య.. UPDATE

image

WGL నగరంలో ఉరేసుకొని బుధవారం <<15587387>>విద్యార్థిని ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన రేష్మిత WGL ములుగు రోడ్డులోని వ్యవసాయ విద్యాలయంలో ఫస్టియర్ చదువుతోంది. విద్యార్థినికి ఇంటిపై బెంగ ఉండటంతో అప్పుడప్పుడు తల్లి ఆమెతో పాటు హాస్టల్‌లో ఉండేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. కాగా, నిన్న శివరాత్రి కావడంతో తోటి విద్యార్థులు సొంతూరు వెల్లగా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Similar News

News November 13, 2025

ECGC లిమిటెడ్‌లో 30 పోస్టులు

image

<>ECGC<<>> లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేడర్‌లో 30 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, ఎంఏ(హిందీ/ఇంగ్లిష్) అర్హతగల అభ్యర్థులు DEC 2వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JAN 11న రాత పరీక్ష, FEB/MARలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.88,635 -రూ.1,69,025 చెల్లిస్తారు.

News November 13, 2025

మెదక్: భార్యను కత్తితో పొడిచి.. భర్త ఆత్మహత్య

image

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధి వెంకటాపూర్ (పిటి)కి చెందిన అంగడి శంకర్ (50) రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులుగా మతిస్తిమితం కోల్పోయి ప్రవర్తిస్తున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిన్న సోదరుడి మనుమరాలు భవనం పైనుంచి కింద పడేసినట్లు తెలిపారు. భార్యపై కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. కుటుంబీకులు ఆసుపత్రికి వెళ్లగా ఇంటి వద్ద ఉన్న శంకర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

News November 13, 2025

ఖమ్మం: 208 స్కూళ్లకు 26 మందే..

image

విద్యార్థులు క్రీడల్లో రాణించడంలో పీఈటీల పాత్ర ఎంతో కీలకం. అయితే జిల్లాలో వారి కొరత తీవ్రగా వేధిస్తోంది. జిల్లాలోని 208 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కేవలం 11 మంది పీడీలు, 15 మంది పీఈటీలు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తంగా 26 మందితోనే నెట్టుకొస్తున్నారు. శారీరక వికాసానికి క్రీడలు తప్పనిసరైనా తర్ఫీదు ఇచ్చేవారు లేకపోవడంతో ప్రతిభ ఉన్నా విద్యార్థులు స్వయంగా సిద్ధమవ్వాల్సి వస్తోంది.