News March 21, 2024
వరంగల్: వైద్యులకు షోకాజు నోటీసులు

వరంగల్లోని పలువురు వైద్యులకు రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ టి.కిరణ్కుమార్ షోకాజు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 17న నర్సంపేట రోడ్డులోని ఓ గార్డెన్లో జరిగిన RMP, PMPల మహాసభలో పలువురు వైద్యులు జాతీయ, రాష్ట్ర వైద్యమండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు.నకిలీ వైద్యులను ప్రోత్సహించేలా వారి అసోసియేషన్కు డబ్బులు ఇవ్వడమే కాకుండా, ఆయా ఆసుపత్రుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News September 5, 2025
వరంగల్ జిల్లాలో ముందస్తు గురు పూజోత్సవాలు..!

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తారు. కానీ మిలాద్ ఉన్ నబి పండుగ, గణపతి నిమజ్జనం ఉండడంతో ప్రభుత్వం అధికారిక హాలిడే ప్రకటించింది. దీంతో ఆయా పాఠశాలల్లో ముందస్తుగానే వర్ధన్నపేట ఉప్పరపల్లిలో సర్వేపల్లి చిత్రపటానికి నివాళులర్పించారు.
News September 4, 2025
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా భూక్య హరిలాల్ నాయక్

వర్ధన్నపేట మండలం ల్యాబర్తి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్గా పని చేస్తున్న భూక్య హరిలాల్ నాయక్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. చిన్నతనంలో ఇదే పాఠశాలలో చదువుకొని, ఓనమాలు నేర్చిన పాఠశాలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో మనబడి పిలుస్తోంది కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాతలను, పూర్వ విద్యార్థులను ఆహ్వానిస్తూ బడి అభివృద్ధికి పాటుపడ్డారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచారు.
News September 4, 2025
ఎయిర్పోర్ట్ను పరిశీలించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఇంజినీరింగ్ బృందం

ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్ బృందం మామునూర్ ఎయిర్పోర్ట్ను ప్రిలిమినరీ సర్వేలో భాగంగా పరిశీలించింది. అనంతరం వారు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డా.సత్య శారదతో ఎయిర్పోర్ట్ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఏఎఐ ఏజీఎంలు నటరాజ్, మనీష్ జోన్వాల్, మేనేజర్లు ఓం ప్రకాష్, రోషన్ రావత్, ఎన్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు .