News February 25, 2025

వరంగల్: శైవ క్షేత్రాలకు నేటి నుంచి స్పెషల్ బస్సులు

image

మహా శివరాత్రి సందర్భంగా ప్రయాణికుల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతోంది. నేటి నుంచి ఈనెల 27వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్-1, వరంగల్-2, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, పరకాల, హనుమకొండ డిపోల నుంచి 255 బస్సులను నడపనున్నారు. ఆయా డిపోల నుంచి కాళేశ్వరం, పాలకుర్తి, కురవి, కొమురవెల్లి, రామప్ప, మెట్టుగుట్టకు నడిపెంచేలా ఏర్పాట్లు చేశారు.

Similar News

News February 25, 2025

జియో హాట్‌స్టార్‌కు పోటీగా.. ఎయిర్‌టెల్, టాటాప్లే జింగాలాలా..

image

జియో హాట్‌స్టార్ తర్వాత మీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగంలో మరో 2 కంపెనీలు విలీనం కాబోతున్నట్టు తెలిసింది. స్వాప్‌డీల్ ద్వారా భారతీ ఎయిర్‌టెల్ తమ DTH బిజినెస్ ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీని టాటా ప్లేతో మెర్జ్ చేయనుందని సమాచారం. ఎయిర్‌టెల్ 52-55%, టాటా 45-48% వాటా తీసుకుంటాయని తెలిసింది. ఇదే జరిగితే టాటా ప్లే‌కు ఉన్న 1.9 కోట్ల హోమ్స్, 5 లక్షల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఎయిర్‌టెల్ పరిధిలోకి వస్తాయి.

News February 25, 2025

మోడల్ స్కూల్ దరఖాస్తుల గడువు పెంపు

image

TG: మోడల్ స్కూళ్ల దరఖాస్తు గడువును మార్చి10వ వరకు పెంచినట్లు విద్యాశాఖ తెలిపింది. ఈనెల 28వ తేదీతో గడువు ముగుస్తుండగా మార్చి10 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం GO జారీ చేసింది. మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఫీజు ఓసీలు రూ.200, ఇతర వర్గాల వారు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. సైట్: https://telanganams.cgg.gov.in/

News February 25, 2025

జడ్చర్ల: ఆటో, బైక్‌ ఢీ.. యువకుడికి గాయాలు

image

జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్‌ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో ఆసుపత్రికి తరలించారు. నసురుల్లాబాద్ శివారులోని మూలమలుపు వద్ద తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!