News March 10, 2025

వరంగల్: సింగల్ పట్టి మిర్చి రూ. 39వేలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి సోమవారం అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.17వేలు పలకగా,1048 రకం మిర్చి రూ.11వేలు, 5531 రకం మిర్చికి రూ. 11,300 ధర వచ్చింది. అలాగే ఎల్లో మిర్చికి రూ.20 వేలు, టమాటా మిర్చికి రూ.28వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.39వేల ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.

Similar News

News March 6, 2026

గ్రేటర్ ఎన్నికల్లో ‘కొండా’ లేనట్లేనా..?

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కొండా ఫ్యామిలీ దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. మేయర్ సీటును ఆశిస్తున్న వారిలో రాజకీయ ప్రముఖులు తమ వారసులను ఎన్నికల బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ‘తాజాగా పరకాల ఎమ్మెల్యే’ సీటుపై కొండా వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి.

News March 5, 2026

WGL: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక!

image

జిల్లాలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’కు రంగం సిద్ధమైంది. జూన్ 15 వరకు సాగే ఈ కార్యక్రమంలో తొలిదశ పారిశుద్ధ్యం, పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఏప్రిల్‌లో ఆరోగ్యం, రోడ్డు భద్రత, సంక్షేమం, బాలల భద్రతపై ప్రత్యేక డ్రైవ్‌లు, మేలో రైతు సమస్యలు, విద్య, క్రీడలు, మహిళా సాధికారతపై దృష్టి సారించనుండగా, జూన్‌లో పర్యావరణ పరిరక్షణతో ఈ ప్రణాళిక ముగియనుంది.

News March 3, 2026

సీఎం సమీక్ష.. పాల్గొన్న వరంగల్ కలెక్టర్

image

ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”పై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. గ్రామ సభల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించాలని సీఎం ఆదేశించారు. ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై స్పష్టత ఇవ్వాలని, ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.