News February 25, 2025

వరంగల్: స్పెషల్ బస్సుల టికెట్ ఛార్జీలు ఇలా..!

image

మహా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఆయా బస్టాండ్ల నుంచి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వరంగల్ నుంచి ఐనవోలుకు రూ.50, మెట్టుగుట్టకు రూ.50, హనుమకొండ నుంచి వేములవాడకు రూ.210, కాళేశ్వరానికి రూ.250, రామప్పకు రూ.140, పాలకుర్తికి రూ.90, తొర్రూరు నుంచి పాలకుర్తికి రూ.100, మహబూబాబాద్ నుంచి కురవికి రూ.30, జనగామ నుంచి కొమురవెల్లికి రూ.100 టికెట్ ధరలను తీసుకోనున్నారు.

Similar News

News November 8, 2025

పల్నాడు: నందికొండ పేరు ఎలా వచ్చిందో తెలుసా.!

image

పురాణాలలో పల్నాడు ప్రాంతాల ప్రస్తావన ఉంది. దక్షయజ్ఞ ధ్వంసం అనంతరం సతీ వియోగంతో శివుడు విసిగిపోయాడు. దీంతో అంగలు-పంగాలు వేసుకుంటూ తన వాహనమైన నందిని ఇప్పటి నాగార్జునసాగర్ ప్రాంతంలో విడిచిపెట్టగా ఆ నంది నందికొండగా పేరు వచ్చింది. శిరమున ఉన్న చంద్రవంకను మాచర్ల ప్రాంత అడవులలో విడిచి పెట్టగా నేటి చంద్రవంక నదిగా మారింది. మెడలో నాగుపామును కనుముల ప్రాంతంలో విడిచి పెట్టగా అది నాగులేరుగా మారిందని ప్రతీతీ.

News November 8, 2025

GNT: 19ఏళ్లలో 500 చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు

image

తెలుగు చిత్ర హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు AVSగా పేరు గాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం గుంటూరు (D) తెనాలిలో జన్మించారు. ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడుగా కేరీర్ ప్రారంభించిన AVS, మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. 19ఏళ్లలో AVS 500 చిత్రాల్లో నటించాడు. అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. ఆయనకు తన కుమార్తె లివర్ దానం చేశారు. కాగా నేడు NOV 8 ఆయన వర్ధంతి.

News November 8, 2025

నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం కేంద్ర కార్యాలయాన్ని సందర్శించనున్నారు. ఆయన పార్టీ కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చర్చించనున్నారు. అలాగే, పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ కూర్పు వంటి ముఖ్య అంశాలపై ఆయన పార్టీ నేతలతో చర్చలు జరపనున్నాయి.