News February 25, 2025
వరంగల్: స్పెషల్ బస్సుల టికెట్ ఛార్జీలు ఇలా..!

మహా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఆయా బస్టాండ్ల నుంచి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వరంగల్ నుంచి ఐనవోలుకు రూ.50, మెట్టుగుట్టకు రూ.50, హనుమకొండ నుంచి వేములవాడకు రూ.210, కాళేశ్వరానికి రూ.250, రామప్పకు రూ.140, పాలకుర్తికి రూ.90, తొర్రూరు నుంచి పాలకుర్తికి రూ.100, మహబూబాబాద్ నుంచి కురవికి రూ.30, జనగామ నుంచి కొమురవెల్లికి రూ.100 టికెట్ ధరలను తీసుకోనున్నారు.
Similar News
News February 25, 2025
ప్రత్యేక హోదా అంశంపై మండలిలో రభస

AP: రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశంపై మండలిలో రభస జరిగింది. ‘హోదా ఎందుకు తేవట్లేదు?’ అని YCP సభ్యులు ప్రశ్నించగా మంత్రి లోకేశ్ స్పందించారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయేకు మద్దతు తెలిపాం. మాపైనే కేంద్రం ఆధారపడినట్లు మేము చెప్పినట్లు వక్రీకరిస్తున్నారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ అన్నారు.. ఏమైంది.? ఏడాదిలో రూ.13వేల కోట్లు తెచ్చాం. YCP 5ఏళ్లలో ఏం సాధించింది’ అని లోకేశ్ ప్రశ్నించారు.
News February 25, 2025
జగన్కు మేమే టికెట్లు కొనిస్తాం: సోమిరెడ్డి

అసెంబ్లీకి రాని YCP ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలను ఎదుర్కోవాలని సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ చేశారు. ‘జగన్ వైసీపీ ఫ్లోర్ లీడర్గా ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ఎక్కువ సేపు మాట్లాడవచ్చు. ప్రతిపక్ష నేతలకు ఫ్రీగా విమానం టికెట్, కారుకు డీజిల్, పీఏను ఇస్తారు. జగన్కు ఫ్రీగా విమానం టికెట్లు కావాలంటే మేమే చందాలు వేసుకుని కొనిస్తాం’ అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.
News February 25, 2025
స్కామ్: లాలూ కొడుకు, కుమార్తెకు షాక్

ల్యాండ్ ఫర్ జాబ్ స్కాములో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్, కుమార్తె హేమకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 11న కోర్టుకు రావాలని స్పెషల్ జడ్జి విశాల్ గాగ్నే ఆదేశించారు. ఈ హై ప్రొఫైల్ కేసులో లాలూ సహా 78 మందిపై CBI దాఖలు చేసిన తుది ఛార్జిషీటును కోర్టు పరిశీలించింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని జోన్లలో భూమికి బదులు ఉద్యోగాలిస్తామని అవినీతికి పాల్పడ్డారని CBI ఆరోపిస్తోంది.